ఆంధ్రప్రదేశ్లో కరోనా ఎఫెక్ట్ అంతా ఇంతా కాదు! సోమవారం ఉదయానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల అరవై మూడు వేల మంది కరోనా బారిన పడ్డారు.ఎనిమిది లక్షల నలభై ఒక్క వేల కరోనా నుండి కోలుకున్నారు.
ఇంకా పధ్నాలుగు వేల ఐదొందల మంది చికిత్స పొందుతుండగా ఏడు వేల మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు.ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లోని పదమూడు జిల్లాల్లో కరోనా స్వైరవిహారం చేసింది.దాదాపు ప్రతి గ్రామంలోకి తొంగిచూసింది..కానీ విజయనగరం జిల్లాలోని ఆ నాలుగు గ్రామాలలోకి మాత్రం కరోనా ప్రవేశించలేకపోయింది.ఇదే ఇప్పుడు రాష్ట్రాన్ని ఆశ్చర్యపరుస్తున్న వాస్తవం. ఈ ఘనత విజయనగరం జిల్లాలోని తూర్పు కనుమల్లో ఉన్న రాయగడ జమ్ము, పల్లం బరిడి, సంతోషపురం, మోరంగూడ గ్రామాలకి దక్కింది .ఇవి గిరిజన ఆవాస గ్రామాలు.దాదాపు తొమ్మిది వేల కుటుంబాలు ఆ నాలుగు గ్రామాల్లో నివసిస్తున్నాయి.కానీ గత మార్చిలో రాష్ట్రంలో ప్రవేశించిన కరోనా వైరస్ ఈ గ్రామాల ప్రజల దరిదాపుల్లోకికూడా రాలేక పోయింది.
అలాగని ఈ గ్రామస్థులు నిత్యం మాస్కులు శానిటైజర్లతో వాడుతూ ఇతర జాగ్రత్తలు తీసుకుంటారనుకుంటే పప్పులో కాలేసినట్టే.ఇప్పటికీ ఎటువంటి కరోనా నిబంధనలు సాధారణ జీవనం గడుపుతున్నారు.ఈ సందర్భంగా వారి జీవన విధానం మనం తెలుసుకోవాలి.ఆ నాలుగు గ్రామాలు బయో గ్రామాలు.అంటే రసాయనిక ఎరువులు లేకుండానే ఇక్కడ పంటలను వారు పండిస్తారు.దంపుడు బియ్యం మాత్రమే తింటారు!పనిచేసిన తర్వాత వారు ఎప్పటికప్పుడు వేపాకులతో చేతులు శుభ్రపరుచుకుంటారు.ఎక్కడికైనా సరే నడిచే వెళతారు.
స్వచ్ఛమైన ఆకుకూరలు పండ్లు,చిరుధాన్యాలు వారు ఎక్కువగా తీసుకుంటారు.ఈ కారణాలన్నిటి వల్ల వారిలో అందరికంటే ఎక్కువగా రోగనిరోధక శక్తి ఉంది.అందువల్లే కరోనా వారిని ఏమీ చేయలేక పోతోందని వైద్యులు చెబుతున్నారు.కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆ గ్రామస్థులు తమకు తెలియకుండానే గత మూడేళ్లుగా పాటిస్తున్నారు.పొరపాటున కూడా తాము రసాయన ఎరువులు వాడిన ఆహారాన్ని తినబోమని గ్రామస్తులు చెప్పారు.ఇదే తమ ఆరోగ్య రహస్యమని చెబుతున్న గిరిజనులను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా ఆదర్శంగా తీసుకోవడం ఎంతైనా అవసరం.