సీడబ్ల్యూసీ నుంచి గ్రామ స్థాయిదాకా కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలంటూ ఆగస్టులో అధినేత్రి సోనియా గాంధీకి లేఖలు రాసి, ఆ తర్వాతి కాలంలో సొంత నేతల నుంచే విమర్శలు ఎదుర్కొన్న అసమ్మతి వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
కాంగ్రెస్ లో నాయకత్వ మార్పు జరగాలని, సంస్థాగత ఎన్నికలను నిర్వహించాలంటూ గత ఆగస్టులో గులాంనబీ ఆజాద్, కపిల్ సిబాల్లతోపాటు 23 మంది నేతలు ఏకంగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.అయితే, లేఖ రాసిన అసమ్మతివాదులతో శనివారం సోనియా గాంధీ సమావేశం కానున్నట్లు సమాచారం. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ ఆధ్వర్యంలో వీరు సోనియాతో భేటీ కానున్నారని సమాచారం. అసమ్మతి నేతలతో సయోధ్య కోసమే అధిష్ఠానం ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను కోల్పోయాక, బీహార్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దయనీయ పరిస్థితికి దిగజారింది.
పార్టీ ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని కపిల్ సిబల్ వంటి నేతలు బాహాటంగానే అంటుండగా, పి.చిదంబరం వంటివారు కూడా మెల్లగా అదే టైపు గళమెత్తుతున్నారు. ఈ సమయంలో రెబల్స్ తో సోనియా జరుపుతోన్న సమావేశం పార్టీ ప్రక్షాళన దిశగా ఉంటుందనే చర్చ జరుగుతోంది.అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారికంగా ఇది సోనియా-రెబెల్స్ నేతల భేటీ అని పేర్కొనలేదు. అసమ్మతి లేఖపై సంతకం చేయని నేతలు కూడా పాల్గొంటారని వెల్లడించింది. ఈ భేటీలో రాహుల్ గాంధీ, ప్రియాంగ గాంధీ వాద్రా కూడా పాల్గొంటారని తెలుస్తోంది.
రెబల్స్ తో సోనియా జరుపుతోన్న సమావేశం పార్టీ ప్రక్షాళన దిశగా ఉంటుందనే చర్చ జరుగుతోంది.కాగా, నాడు అసమ్మతివాదుల డిమాండును తెరవెనుక నుంచి సమర్థించిన కమల్ నాథ్.. ఆ తరువాత లేఖ రాసిన నాయకులతో సమావేశం కావాలని గాంధీ కుటుంబానికి నచ్ఛజెప్పారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అసమ్మతి నేతలతో సయోధ్య కోసమే అధిష్ఠానం ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే, నూతన సంవత్సరంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగాల్సి ఉంది. బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నెల 19 న ఈ మీటింగ్ జరగనుందా అన్నది స్పష్టం కావడంలేదు.