WhatsApp: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సప్.. ఇటీవల ప్రైవసీ నిబంధనల కారణంగా వాట్సాప్ డౌన్ లోడ్ లు తగ్గాయి.. ఈ నేపథ్యంలో టెలిగ్రామ్, సిగ్నల్ యాప్ డౌన్లోడ్లు పెరిగాయి.. వాట్సాప్ తన యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ పై టెస్టింగ్ చేస్తోంది..
ఇటీవల వాట్సాప్ డిస్సప్పియరింగ్ మెసేజ్ అనే కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఫీచర్ తో మీరు పంపిన మెసేజ్ లు వారం రోజుల తర్వాత ఆటోమేటిక్ గా ఇంతకు ముందు వరకు కు డిలీట్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఆ సమయాన్ని 24 గంటలకు తగ్గించేందుకు ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్, డెస్క్టాప్ లో వాట్సాప్ టెస్టింగ్ చేస్తున్నట్లు తెలిపింది. వీటితోపాటు వాట్స్అప్ కొత్తగా మళ్ళీ తన సేవా నియమాలకు సంబంధించిన అలర్ట్ యాప్లో అందించనుంది. ఇంతకుముందు వీటిని యాక్సెప్ట్ చేయని ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ అలర్ట్ వస్తోంది.
ముందు ముందు వాట్సాప్ వినియోగదారులు తమ చాట్ లను ఐఓఎస్, ఆండ్రాయిడ్ ల మధ్య కూడా మార్చుకునేలా కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. మల్టీ డి వైజ్ సపోర్ట్ ద్వారా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీని వలన కొత్తగా ఫోన్ కొన్నప్పుడు వినియోగదారులు చాట్ బ్యాకప్ ఈ విషయంలో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?