Tollywood: కొన్ని సూపర్ హిట్ కాంబినేషన్లో సినిమాను అనౌన్స్ చేస్తున్నారు. కానీ అవి ఎప్పుడు పట్టాలెక్కుతాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అందరూ పూరి జగన్నాధ్ మాదిరిగా సినిమా తర్వాత సినిమాను ప్రకటిస్తూ కంప్లీట్ చేస్తూ ఉండేవారు చాలా తక్కువమంది ఉన్నారు. దర్శక ధీరుడు రాజమౌళి కూడా సాధ్యమైనంత వరకు సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడు మరో సినిమాను ప్రకటించింది లేదనే చెప్పాలి. కానీ చాలా సినిమాలు ఘనంగా ఓపెనింగ్ జరుపుకున్న తర్వాత రకరకాల కారణాల తర్వాత ఆగిపోతున్నాయి. గతంలో ఇలా జరిగినవి ఎన్నో ఉన్నాయి.
ఈ మధ్య కాలంలో కూడా ఎన్.టి.ఆర్ – త్రివిక్రం కాంబినేషన్ లో మూవీ అనౌన్స్ అయి ఆగిపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ డిలే అవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు తారక్ నెక్స్ట్ మూవీని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. అలాగే త్రివిక్రం శ్రీనివాస్ నెక్స్ట్ సినిమాను మహేశ్ బాబుతో చేయబోతున్నాడు. ప్రస్తుతం మహేశ్ బాబు సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. వాస్తవంగా ఈ సినిమా తర్వాత మహేశ్ – రాజమౌళి కాంబినేషన్లో ఓ పాన్ ఇండియన్ సినిమా మొదలవ్వాలి. కానీ ఆర్ఆర్ఆర్ పూర్తి చేసి మహేశ్ మూవీ కొసం పూర్తి స్థాయి స్క్రిప్ట్ సిద్దం చేయడానికి చాలా సమయం పడుతుంది.
Tollywood: త్రివిక్రం – అల్లు అర్జున్ మూవీ 2023 కు పోస్ట్ పోన్ అవుతుందనడంలో సందేహం లేదు.
దాంతో మహేశ్ నెక్స్ట్ సినిమాను త్రివిక్రంతో కమిటయ్యాడు. ఇక తాజాగా త్రివిక్రం నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ తో చేయబోతున్నట్టు నిర్మాత సూర్య దేవర నాగవంశి ప్రకటించారు. త్వరలో దీనికి సంబంధించిన అధికారకమైన ప్రకటన కూడా రానుందని పేర్కొన్నారు. అయితే ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ ఉండే అవకాశాలున్నాయి. ముందు మహేశ్ సినిమా అవ్వాలి. ఆ తర్వాత అల్లు అర్జున్ సినిమా మొదలవుతుంది. అయితే అల్లు అర్జున్ మళ్ళీ పుష్ప పార్ట్ 2 గనక చేయాల్సి వస్తే అప్పుడు త్రివిక్రం – అల్లు అర్జున్ మూవీ 2023 కు పోస్ట్ పోన్ అవుతుందనడంలో సందేహం లేదు.
పవన్ కళ్యాణ్ సినిమాలు కమిటయిన సినిమాలు తలుచుకుంటే రెండేళ్ళు కూడా అవసరం లేదు. కానీ ఆయన రాజకీయాలతో బిజీగా ఉండటంతో అనుకున్న సమయానికి ఆయన సినిమాలు కూడా పూర్తి కావడం లేదు. ఇక కొరటాల శివ అల్లు అర్జున్ కాంబినేషన్లో గత ఏడాది ఓ సినిమాను ప్రకటించారు. ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ అటకెక్కినట్టే. దీనికి సంబంధించిన ప్రకటన మళ్ళీ రానేలేదు. అలాగే విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుందని సోషల్ మీడియాలో చర్చలు సాగాయి. కానీ ఆయన గత చిత్రం టక్ జగదీష్ ఫ్లాపవడంతో ఇప్పుడు కొత్త కథ రాసుకుంటున్నాడు. ఆ కథ ఎవరితో చేయనున్నాడో ఇంకా తెలీదు.
Tollywood: అవి పట్టాలెక్కుతాయో క్యాన్సిల్ అవుతాయో చెప్పడం కష్టంగా మారింది.
బండ్ల గణేశ్ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేస్తాడని స్వయంగా తెలిపాడు. కానీ అది ఇప్పట్లో సాధ్యపడదని టాక్ వినిపిస్తోంది. ఇక టాలీవుడ్లో మోస్ట్ క్రేజీ డైరెక్టర్గా మారాడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ప్రభాస్తో సలార్ సినిమా చేస్తున్న ఆయన నెక్స్ట్ సినిమాను రామ్ చరణ్తో చేయబోతున్నట్టు ప్రకటించారు. వాస్తవంగా సలార్ తర్వాత ఎన్.టి.ఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా ఉండాల్సింది. కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే మరో ఏడాది పైనే పడుతుందని టాక్ వినిపిస్తోంది. ఇలా చాలా కాంబినేషన్లో మూవీ అనుకుంటున్నారు..అనౌన్స్ చేస్తున్నారు. అవి పట్టాలెక్కుతాయో క్యాన్సిల్ అవుతాయో చెప్పడం కష్టంగా మారింది.