బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటించిన చిత్రం క్రిష్. క్రిష్ ఫ్రాంఛైజీ లో వచ్చిన సినిమా సిరీస్ లు ప్రేక్షకులని ఎంతగా అలరించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదీగాక క్రిష్ చిత్రం పెద్దలనే కాదు పిల్లలను కూడా విశేషంగా ఆకట్టుకుంది. కాగా గత కొంతకాలంగా క్రిష్ చిత్రానికి సీక్వెల్ గా క్రిష్ 4 రూపొందించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఇప్పుడు ప్రాజెక్ట్ కి ముహూర్త్మ్ కుదిరినట్టు తెలుస్తోంది. కాగా బాలీవుడ్ నుంచి రానున్న అత్యంత భారి బడ్జెట్ సినిమాలలో క్రిష్ 4 ఒకటి. మొదటి మూడు సినిమాలకు ఏ స్థాయిలో క్రేజ్ దక్కిందో అందరికీ తెలిసిందే.
అందుకే ఇప్పుడు ఆ మూడు భాగాలని మించి క్రిష్ 4 ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక 2003లో వచ్చిన కోయి మిల్గయా తర్వాత 2006లో క్రిష్, 2013లో క్రిష్ 3 చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇవి అభిమానులకి అమితానందాన్ని కలిగించడంతో క్రిష్ 4 కోసం ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. ఇక ఇప్పటికే క్రిష్ 4 కి సంబంధించి అఫీషియల్ ప్రకటన రాగా, దీనికి సంబంధించిన మరో ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఇప్పటికే హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ ఈ చిత్రానికి సందంధించిన స్క్రిప్ట్ పని ముగించి, ప్రస్తుతం కథానాయికల వేటలో ఉన్నారట. ఇందులో భాగంగా హీరోయిన్లుగా కియరా లేదా కృతి సనన్ ను సంప్రదించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ ఇద్దరు భామల కాల్షీట్లు లాక్ అయ్యి ఉన్నాయని తెలుస్తోంది. అయినా గానీ ఈ చిత్రంలో నటించడానికి ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. దీంతో ప్రస్తుతం ఈ స్టార్ హీరోయిన్స్ మధ్య పోటీ నెలకొందంటున్నారు. మరి ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి. కాగా వార్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న హృతిక్ రోషన్ కు గత సంవత్సరం అన్నిరకాలుగా కలిసొచ్చింది.