Mahesh : తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట నుంచి ఫస్ట్ నోటీస్ వచ్చి అభిమానులకి ఎదురు చూస్తున్న అప్డేట్ ఇచ్చారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా విడుదలైన ఫస్ట్ నోటీస్ లో 2022 సంక్రాంతి జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. అంతేకాదు మహేష్ బర్త్ డే అయిన ఆగస్టు 9న బ్లాస్టింగ్ అప్డేట్ రానుందని వెల్లడించారు. అంటే ఆ రోజు మహేష్ సర్కారు వారి పాట నుంచి టీజర్ రాబోతోంది. ఈ టీజర్ తో సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో దర్శకుడు పరశురాం చిన్న హింట్ ఇవ్వబోతున్నాడు.
Mahesh : ఈ సినిమాకి మహేష్ కూడా భాగస్వామి కావడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ తో కలిసి తన జీఎంబీ సంస్థలో నిర్మిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి లీకైన పిక్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఇక తాజా అప్టేడ్లో మహేష్ లుక్ అదిరిపోయింది. దీంతో సర్కారు వారి పాట పాన్ ఇండియన్ సినిమాగా రానుందా అని సందేహాలు కూడా మొదలయ్యాయి. ఏదేమైనా సర్కారు వారి పాట నుంచి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. కానీ ఆయన నటించనున్న మరో సినిమాకి సంబంధించిన అప్డేట్ మాత్రం రావడం లేదని అభిమానులు ఫీలవుతున్నారు.
Mahesh : ఈ కాంబినేషన్ కి సంబంధించిన అప్డేట్ మాత్రం రావడం లేదు.
మహేష్ బాబు తన 28వ సినిమాను మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇంతకముందు అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు హ్యాట్రిక్ సినిమా రాబోతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే మహేష్ బర్త్ డే దగ్గరికి వచ్చేస్తుంది. సర్కారు వారి పాట నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. కానీ ఈ కాంబినేషన్ కి సంబంధించిన అప్డేట్ మాత్రం రావడం లేదు. ఇంకా సినిమా మొదలవలేదు. కాబట్టి ఆగస్టు 9న దీని నుంచి ఎలాంటి అప్డేట్ రాదని టాక్ వినిపిస్తోంది. మరి మేకర్స్ ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశారేమో చూడాలి.