ప్రస్తుతం తెలంగాణలో కరోనా వైరస్ వల్ల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కోవిడ్-19 ప్రస్తుతం రాష్ట్రంలో చాలా ఉదృతంగా ఉంది. దాదాపు 30 శాతం టెస్టు చేసిన కేసులు పాజిటివ్ అని తేలుతున్నాయి. గాంధీ ఆసుపత్రిలో వసతులు సరిగా లేవని గొడవ జరుగుతోంది.
మరోవైపు కరెంట్ బిల్లులు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇన్ని జరుగుతుంటే తెలంగాణ సీఎం కె చంద్రశేఖర్ రావు కనీసం స్పందించట్లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. నిన్నటి నుండి ప్రగతి భావం లో పనిచేసే 20 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, సీఎం కేసీఆర్ ను ఫామ్ హౌజ్ కు షిఫ్ట్ చేసారని అంటున్నారు. దీనిపై ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో జనాల్లో ఆందోళన నెలకొంది.