మనకు మొత్తం పదిహేను తిథులు ఉన్నాయి. అయితే మరి మనం ఏ పని చేసినా తిధిని , ముహూర్త చూసి చేస్తాం.. మరి ఈ పదిహేను తిథులలో ఏ తిథి లో ఏపని చేస్తే మంచిది అనేది తెలుసుకుందం…
పాడ్యమి రోజు కొత్త పనులు మొదలు పెట్టకూడదు. ఉద్యోగం, వ్యాపార, వర్తక వాణిజ్యాలు కూడా వద్దు .
విదియ రోజు ఏ పని చేసిన కార్యసిద్ధి కలుగుతుంది. కొత్తగా ఏ పనులు మొదలు పెట్టిన బాగా జరుగుతాయి. వివాహాలలు చేసుకోవడానికి ఇది మంచిదే..
తదియ రోజు ప్రయాణాలు పెట్టుకుంటే చాలా మంచిది. అందునా ఉత్తర దిక్కు ప్రయాణాలకు ఇంకా శుభం
చవితి రోజున ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది.పెళ్లి చూపులు కూడా పెట్టుకోకూడదు.
పంచమి రోజు అన్నింటికి శుభము కలుగుతుంది. కార్య సిద్దిని ఇస్తుంది.
షష్ఠి రోజు కొత్త పనులుచేయకూడదు. గొడవలు జరిగే అవకాశం ఉంటుంది.
సప్తమి రోజు ఎక్కడకు వెళ్లినా కూడా మంచి జరుగుతుంది. కార్యాలు సిద్దిస్తాయి.
అష్టమి రోజు ఏమి చేసిన కొత్త కష్టాలు వస్తాయి.కొత్తగా వ్యాపారం, వాణిజ్యం మొదలు పెట్టవద్దు .
నవమి రోజు కొత్త పనులు ఏవీ వద్దు. పర్యటనలు కూడాచేయకూడదు. దానివలన సమస్యలు వస్తాయి.విదేశాలకు ఈ రోజు వెళ్లడం మంచిదికాదు.
దశమి రోజు ఏ పని మొదలుపెట్టిన విజయం పొందుతారు.అన్ని తిధులలో పూర్తి విజయాన్ని ఇచ్చేది కేవలం దశమి మాత్రమే..
ఏకాదశి రోజు అన్నింటికి మంచిది విజయం కలుగుతుంది.
ద్వాదశి రోజు అంత శుభం ఏమి కాదు.
త్రయోదశి రోజు అన్ని శుభాలను ఇస్తుంది.
బహుళ చతుర్థీ రోజు అంత మంచిది కాదు. కొత్త పనులు ఏమి మొదలు పెట్టవద్దు.
అమావాస్య తిథి నాడు ప్రయాణాలు చేస్తే మంచిది కాదు అనిఅంటుంటారు.కాని ఉత్తరాధిన కొందరు ఈ రోజు ఎన్నో ప్రయాణాలు చేస్తారు. కొన్నిపనులు కూడా మొదలు పెడుతుంటారు. దక్షిణాదిన అమావాస్య రోజు నిషిద్ధం గా భావిస్తారు. అమావాస్యని ఒక్కో ప్రాంతం లో ఒక్కో విధంగా లెక్కలోకి తీసుకుంటారు.