సంక్షోభాల నుంచి తాను అవకాశాలు వెతుక్కుంటానని మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తరచూ చెబుతుంటారు.
ఇప్పుడు ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా అదే సిద్ధాంతాన్ని పాటిస్తున్నట్లు కనిపిస్తోంది.కరోనా లాక్డౌన్ సమయంలో దొరికిన విశ్రాంతి సమయాన్ని లోకేష్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నట్లు స్పష్టం అవుతోంది.ఈ రెండు నెలల్లో లోకేష్ పదిహేను కిలోలు బరువు తగ్గడంతో పాటు బుర్ర కి కూడా పదును పెట్టారు.తాజాగా ఆయన నిర్వహించిన విలేకరుల సమావేశమే లోకేష్ తడబడకుండా మాట్లాడ్డం,ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకపోవటం వంటివి ఆయనలో వచ్చిన మార్పుకు స్పష్టమైన సంకేతాలు.సాధారణంగా లోకేష్ మాట్లాడినప్పుడల్లా ఏదో ఒక పొరపాటు దొరకడం ,అది ట్రోల్ కావడం తెలిసిందే.కానీ తాజా విలేఖరుల సమావేశంలో మాత్రం లోకేష్ అలాంటి అవకాశం ఎవరికీ ఇవ్వలేదు.ఈ మీడియా సమావేశంలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఆయన స్పష్టంగా గణాంకాలతో సహా సుదీర్ఘంగా వివరించారు.అంతేగాక తాను ఇంగ్లీషు మీడియంలో చదువుకున్నందున తెలుగుతో కొద్దిగా ఇబ్బంది ఉన్న మాట వాస్తవమేనని కూడా అంగీకరించారు. తద్వారా ఇంగ్లీషు మీడియంలో చదవటం కంటే తెలుగుతో పునాదేసుకోవటమే మంచిదన్న సందేశాన్ని కూడా ప్రజలకు ఇస్తూ పరోక్షంగా జగన్కు చురక వేశారు!ఇంతలోనే లోకేష్ లో అంత మార్పు ఎలా వచ్చిందన్నది ఇప్పుడు చర్చినీయాంశం.తాను పుంజుకోని పక్షంలో జూనియర్ ఎన్టీఆర్ పార్టీని తన్నుకు పోతాడన్న సత్యాన్ని లోకేష్ అవగతం చేసుకుని తనను తానే సంస్కరించు కున్నాడని తెలుగు తమ్ముళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు.ఏదేమైనా లోకేష్ లో వచ్చిన ఈ మార్పు పట్ల టిడిపిలో హర్షాతిరేకం వ్యక్తం అవుతోంది.ఇంతకీ లోకేష్కు ట్యూటర్ ఎవరన్నది జవాబు దొరకని ప్రశ్న!