AP BJP : నిన్న తెలుగు టెలివిజన్ ఛానల్ అయిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లో జరిగిన ఒక లైవ్ డిబేట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమరావతి రైతులందరూ చేపడుతున్న ఉద్యమాల గురించి నిన్న తీవ్రస్థాయిలో చర్ఛ జరిగింది. ఇందులో అమరావతి ఉద్యమాలు…. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా జరుగుతున్నాయి అన్న అంశంపై చర్చించుకున్నారు.
కాలి చెప్పుని విసిరేశారు…
అయితే అమరావతి పరిరక్షణ సమితి జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సభ్యుడైన కొలికపూడి శ్రీనివాసరావు రావు, అలాగే బిజెపి ఆంధ్ర రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయిన విష్ణువర్ధన్రెడ్డి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయిలో జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీనివాస రావు తన కాలి జోడుని ని తీసి భారతీయ జనతా పార్టీ నాయకుడైన విష్ణువర్ధన్ రెడ్డి మీదకి లైవ్ లోనే విసరడం జరిగింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రమంతా భగ్గుమంది.
బాబు మనిషే…?
ఏపీ భారతీయ జనతా పార్టీ వారు ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. వెంటనే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ వారు శ్రీనివాస రావు పైన ఫిర్యాదు చేయవలసిందిగా డిమాండ్ చేశారు. అలాగే ఏపీ బీజేపీ లీడర్లంతా ఈ సంఘటన వెనక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అమరావతి జేఏసీ సభ్యుడైన శ్రీనివాసరావు చంద్రబాబు మనిషి అని…. అతనికి బాగా నమ్మకస్తుడు అని బీజేపీ చెప్పడం గమనార్హం.
గతంలోనూ….
అంతేకాకుండా వారి వ్యాఖ్యలకు సపోర్టుగా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా బిజెపి వారిపై ఇలాంటి దాడులు జరిగాయని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమిత్ షా వెళుతున్న వాహనంపై కూడా దాడి జరిగిన విషయాన్ని వారు గుర్తు చేశారు. అలాగే దీని వెనుక కూడా టీడీపీ హస్తం ఉందని నొక్కి వక్కాణిస్తున్నారు. ఇదే క్రమంలో బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఈ దాడి వెనుక టిడిపి కుట్ర ఉందని…. అటువంటిది ఏమీ లేకపోతే చంద్రబాబు గారు లైవ్ లో జరిగిన ఈ దాడిని ఖండించాలి అని డిమాండ్ చేశారు.