చంద్రబాబు తర్వాతి స్థానం టిడిపిలో ఎవరిది ఉన్నది ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశం. నిజానికి చంద్రబాబు ఇప్పుడు టిడిపి జాతీయ అధ్యక్షుడిగా ఉండగా ఆంధ్రప్రదేశ్ శాఖకు కళా వెంకటరావు తెలంగాణ శాఖకు ఎల్ వి రమణ అధ్యక్షులుగా ఉన్నారు.
మామూలుగా అయితే వీరినే ఆయా రాష్ట్రాల్లో పార్టీలో నెంబర్ టూ గా పరిగణించాల్సి ఉంటుంది. అయితే టీడీపీలో ఆ పరిస్థితి లేదు అన్నది నిర్వివాదాంశం. ఇందుకు కారణం చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ బాబే!చినబాబు రాజకీయాల్లో బాగా చురుకుగా ఉన్నందున, పైగా అధినేతకు ఏకైక కుమారుడు అయినందున పార్టీలో ఆయననే నెంబర్ టూ గా పరిగణించాల్సి ఉంటుంది. కానీ చిన్న బాబు రాజకీయ అపరిపక్వత ఆయనకు పెద్ద మైనస్ పాయింట్. అదేసమయంలో చంద్రబాబుకు వృద్ధాప్యం కూడా వచ్చేసింది. తప్పనిసరిగా ఈ పరిస్థితుల్లో టిడిపిలో చంద్రబాబు తర్వాత స్థానంలో ఎవర్నో ఒకర్ని ఉంచి రాజకీయాలు నడపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ఒకరు ఎవరు అన్నదే టిడిపిలో నలుగుతున్న అంశం.ఎన్టీఆర్ పార్టీ నడిపించే సమయంలో పార్టీలో నెంబర్ 2గా ఉన్నారు చంద్రబాబు .ఆ తర్వాత ఆయన పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి బాధ్యతల తర్వాత కొంత కాలం మాధవరెడ్డి, తర్వాత కొంత కాలం దేవేందర్ గౌడ్ ఉన్నారు. ఆ తర్వాత పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాక చంద్రబాబుకు కుడిభుజంగా యనమల వ్యవహరించారు.దేవినేని ఉమామహేశ్వరరావు కూడా ఒక వెలుగు వెలిగారు.కాపు కోటాలో చినరాజప్పకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు.బీసీ అయిన కళా వెంకట్రావును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని చేశారు.మరో బి సి ఎల్ వి రమణకి తెలంగాణ పార్టీ పగ్గాలు అప్పగించారు..అయినా వారికి అంత వాల్యూ ఎడిషన్ లేకుండా పోయింది. అలాగని చినబాబును చూస్తే ఆయన రాజకీయ పరిజ్ఞానం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది.
ఒకవైపు జగన్ ప్రభుత్వం టిడిపిని బుల్డోజు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆ దూకుడు ని తట్టుకొని చంద్రబాబునాయుడు మాదిరిగా పార్టీని నడిపించే ప్రత్యామ్నాయ నాయకుల కొరత టిడిపిలో కనిపిస్తోంది. ఇప్పుడైతే టిడిపిలో రెండో ప్లేస్ అంటూ ఎవరికీ లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. లోకేష్ గనుక ఇంకా తన తప్పులను సరిదిద్దుకోని పక్షంలో జూనియర్ ఎన్టీఆర్ వచ్చేసి పార్టీని ఆక్రమిస్తాడు అన్న అంచనాలు ఉన్నాయి. ఏం జరుగుతుందో వేచి చూడాలి.