విశాఖలో వైసీపీ అగ్రనేత విజయసాయి రెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ టిడిపి ఎప్పటినుంచో ఒక రకమైన విష ప్రచారం సాగిస్తోంది!
టీడీపీకి ప్రధాన శత్రువులు ఎవరైనా ఉన్నారంటే అది జగన్ మోహన్ రెడ్డి !ఆ తర్వాత విజయసాయిరెడ్డే! అవకాశం దొరికి నప్పుడల్లా విజయసాయిరెడ్డిపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మొదలు బుదా వెంకన్న, నారా లోకేష్ తదితరులంతా విరుచుకు పడుతుంటారు! ఈ నేపథ్యంలో విశాఖ వైసిపి నేత కొయ్య ప్రసాద్రెడ్డి భూకబ్జాల ఉదంతం వెలుగుచూసింది.ప్రసాదరెడ్డి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారు పార్టీకూడా సస్పెన్షన్ వేటు వేసింది !
అయినప్పటికీ టిడిపి ఇంకా విజయసాయిరెడ్డిని వదలలేదు! కొయ్య ప్రసాద్రెడ్డి కూడా విజయసాయిరెడ్డి అనుచరుడే నని,అతడి భూ కబ్జాల వెనుక విజయసాయిరెడ్డి హస్తం ఉందని టిడిపి కొత్త ప్రచారం మొదలుపెట్టింది.దీంతో విజయసాయి రెడ్డి స్పందించారు! తన పేరు చెప్పి భూకబ్జాలకు పాల్పడే ఎవరిని కూడా ఉపేక్షించే ప్రసక్తి లేదని హెచ్చరించారు.భూ అక్రమాల విషయంలో సీఎం జగన్ కూడా చాలా సీరియస్ గాఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరినైనా సరే భూ అక్రమాలకు పాల్పడితే వదిలే ప్రసక్తి లేదని సీఎం స్పష్టం చేసినట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు.
ఎవరైనా తన పేరు చెప్పి భూకబ్జాలకు పాల్పడితే కేసులు పెట్టించి అరెస్టు కూడా చేయిస్తానని ఆయన చెప్పారు.విజయ విజయసాయిరెడ్డి ప్రకటనను విశ్లేషిస్తే ఆయన తన వెనక జరుగుతున్న వ్యవహారాన్ని ఇప్పటికి పసిగట్టి జాగ్రత్త పడుతున్నట్టు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకు చెబుతున్నారు.తద్వారా జగన్ కి కూడా ఆయన సంజాయిషీ ఇచ్చినట్లు అదే సమయంలో తెలుగుదేశం పార్టీని సమాధాన పరిచినట్లు వారు చెబుతున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?