చంద్రబాబు నాయుడుపై మాన్సాస్ అధినేత చైర్మన్ సంచయిత గజపతిరాజు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడుకు ఇంత స్ట్రాంగ్ కౌంటర్ వచ్చిన దాఖలాలు లేవు.
విజయనగరం గజపతిరాజుల సంస్థ మాన్సాస్ ట్రస్ట్ కి సంబంధించి కుటుంబ పరమైన విభేదాలు తలెత్తాయి.న్యాయపరమైన పోరాటం జరిగింది చివరకు టిడిపి కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతిరాజు నుండి నుండి ఆయన సోదరుడు ఆనందగజపతిరాజు కుమార్తె అయిన సంచయిత గజపతిరాజు కు మాన్సాస్ ట్రస్ట్ పగ్గాలు లభించాయి.ఇంతటితో ఈ వివాదం సమసిపోయిందనుకుంటే దాన్ని మాటి మాటికి చంద్రబాబు ,ఆయన కుమారుడు లోకేష్ బాబులు కెలుకుతున్నారు.మాన్సాస్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలేదని, రోడ్డున పడ్డారంటూ మొన్న లోకేష్ ట్వీట్ చేస్తే అదిరిపోయే రేంజిలో సంచయిత జవాబు చెప్పారు. దెబ్బకు చినబాబు నుంచి సౌండ్ లేదు.
అంతటితో ఆగకుండా చంద్రబాబు మళ్లీ ఆ ట్రస్ట్ గురించి కొన్ని ట్వీట్లు చేశారు.మాన్సాస్ వైభవం, ప్రాభవం ఇంతేనా అంటూ ఏదేదో ట్వీటారు. దీంతో మాన్సాస్ చైర్ పర్సన్ సంచయితకు బాగా మండుకొచ్చింది. చినబాబుకు జవాబు చెప్పాను, దాన్ని కాపీ చేసి చూసుకోండంటూ పెదబాబుకు కౌంటరిచ్చారు.జీతాలు ఇవ్వలేదన్న వార్తలను ఆమె ఖండించారు.గత ఐదేళ్లలో చంద్రబాబు, తన బాబాయి అశోక్ గజపతిరాజుల కారణంగానే ఈ ట్రస్టు ఇంత దుస్థితికి చేరుకుంది అని ఆమె ఎదురు దాడి చేశారు.మాన్సాస్ ట్రస్ట్ వైభవానికి ఢోకా లేదని కూడా స్పష్టం చేశారు.
ఒకవేళ ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటన్నింటిని కూడా తాము సరిదిద్దుకుంటామని ఆమె చెప్పారు .ఇలా అవాస్తవాలను అదే పనిగా ప్రచారం చేస్తున్న బాబు సారీ చెప్పాలని కూడా సంచయిత డిమాండ్ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. పెదబాబు చినబాబులని ఈ రేంజ్ లో అటాక్ చేయడం ఆమెకే సాధ్యపడిందని ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. హుందాతనంతో తో కూడిన రాజకీయాలు నడపాలని తరచూ చంద్రబాబు చెబుతుంటారు. కానీ ఆ పని చంద్రబాబు మాత్రం చేయరని ఒక విమర్శ ఉంది.
కుటుంబపరమైన ట్రస్ట్ వ్యవహారంలో చంద్రబాబు జోక్యం ఏమిటి దానిపై విమర్శలు ఏమిటని వ్యాఖ్యలు వినవస్తున్నాయి.అయితే సంచయిత గట్టిగానే కౌంటర్ ఇవ్వడంతో చంద్రబాబుకు షాక్ తగిలిందని చెప్పవచ్చు.అలాగని చంద్రబాబు లోకేష్బాబులు ఇంక ఈ వ్యవహారాన్ని కెలక్కుండా ఉంటారాఅన్నదే చూడాల్సి ఉంది! సంచయిత ఇచ్చిన డోసు చూశాక ఇక నారా వారు ఈ సబ్జెక్టు గురించి మాట్లాడకపోవడమే మంచిది అని టీడీపీ వర్గాలే సలహా ఇస్తునాయి.