జగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయింది. ఈ ఏడాదిన్నర పాలనాకాలాన్ని, జగన్ నిర్ణయాలను గమనించిన నాయకులు, పరిశీలకులు.. అచ్చు.. జగన్ నిర్ణయాలు, ఆయన ఆలోచనలు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని పోలి ఉన్నాయని చెబుతున్నారు
ఒక్కసారి మమతా బెనర్జీ పాలిటిక్స్ గురించి చూస్తే.. కమ్యూనిస్టులు దాదాపు 35 సంవత్సరాల పాటు ఏకధాటిగా పాలించిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమత పాగా వేశారు. వరుస విజయాలు సాధించారు. నిజానికి అక్కడ పాగా వేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాయి.
అయినప్పటికీ. మమత దూకుడును ఇవి పట్టుకోలేక పోతున్నాయి. దీనికి కారణం.. నేరుగా మమతకు ప్రజలతో సంబంధాలు ఉండడమే. ప్రతి నెల రెండు రోజులు విధిగా జిల్లాల వారీగా ఆమె ప్రజల కష్టాలు సుఖాలు తెలుసుకుంటారు. దీంతో వారి మనసుల్లో ఆమెకు మంచి స్థానం ఉంది. ఇక, డౌన్ టు ఎర్త్ అనే ఫార్ములాను ఆమె అనుసరిస్తారు. అంటే.. తాను చాలా సింపుల్గా ఉంటారు. నేత చీరలు కట్టుకుంటారు. హవాయి చెప్పులు వేసుకుంటారు.ఇక, ప్రజాప్రతినిధుల కంటే.. అంటే తన పార్టీ తరఫున గెలిచిన నాయకుల కంటే కూడా ఎస్పీలకు, కలెక్టర్లకు అధికారాలు ఎక్కువగా ఇచ్చారు.
ఇది ఆమెకు వ్యక్తిగతంగా కీర్తిని తెచ్చిపెట్టింది.మరి, ఇదే రేంజ్లో దూకుడు ప్రదర్శిస్తున్న జగన్ కూడా నేతలను పక్కన పెట్టి ప్రజలతో మమేకం అవుతున్నారు ఎస్పీలు, కలెక్టర్లకు అధికారాలు విస్తృతంగా ఇచ్చారు.ఆయన కూడా నిరాడంబర జీవనం గడుపుతున్నారు.వీటిని గమనిస్తే జగన్ దీదీ పంధాలో పయనిస్తున్నట్లు స్పష్టమవుతోంది ఇది ఎంతవరకు సత్పలితాలు ఇస్తుందో వేచి చూడాలి