Venkatesh : విక్టరీ వెంకటేష్ యంగ్ హీరోలతో పోటీపడి వరుసగా సినిమాలను కమిటవుతూ వస్తున్నాడు. అంతేకాదు కమిటయిన ప్రాజెక్ట్స్ ని ఏ మాత్రం డిలే చేయకుండా బల్క్ డేట్స్ ఇస్తూ సినిమాను జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేసేస్తున్నారు. ప్రస్తుతం వెంకటేశ్ నటించిన తమిళ సూపర్ హిట్ సినిమా అసురన్ తెలుగు రీమేక్ ‘నారప్ప’ పూర్తి చేశారు. త్వరలో ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. ప్రియమణి హీరోయిన్ గా నటించింది. తమిళంలో 100 కోట్లు వసూళ్ళు చేసిన ఈ సినిమా తెలుగులో ఎంత వసూళ్ళు చేస్తుందనేది అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇక వెంకటేశ్ ఈ సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాడు. సురేష్ బాబు – కలైపులి ఎస్ థాను కలిసి నిర్మించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఇక మలయాళ సూపర్ హిట్ సీక్వెల్ దృశ్యం 2 కూడా పూర్తి చేశారు. సీనియర్ హీరోయిన్ మీనా వెంకీ కి జంటగా నటించారు. తెలుగులో వచ్చిన దృశ్యం సూపర్ హిట్ గా నిలవడంతో దృశ్యం 2 మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు సినిమాలు చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాకపోవడంతో ఆయన అభిమానులు కొంత నిరాశ చెందిన విషయం తెలిసిందే.
Venkatesh : వెంకటేశ్ 75 ఓ యంగ్ డైరెక్టర్ తో ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.
దాంతో వెంకీ అభిమానులకు సారీ కూడా ఇటీవల చెప్పారు. అంతేకాదు తన నెక్స్ట్ మూవీస్ ని తప్పకుండా థియేట్రికల్ రిలీజ్ చేస్తానని తెలిపారు. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3లో నటిస్తున్నారు. భారీ హిట్ సాధించిన ఎఫ్ 2 కి సీక్వెల్ గా వస్తున్నప్పటికి కథాంశం మాత్రం పూర్తి వైవిధ్యంగా ఉంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి పేర్కొన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత వెంకీ మైల్ స్టోన్ మూవీ 75 ఎవరితో చేస్తారు.. అనే టాక్ మొదలైంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అది వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. అయితే ఓ యంగ్ డైరెక్టర్ తో ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?