రాష్ట్రంలో సంచలనం రేపిన తూర్పుగోదావరి జిల్లా శిరోముండనం కేసు బాధితుడు తన విషయంలో రాష్ట్రపతి జోక్యాన్ని కోరుతూ ఆయనకి నేరుగా లేఖ రాయడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.
భారత రాష్ట్రపతి తనకు న్యాయం చేయలెని పక్షంలో తాను మావోయిస్టుల్లో చేరిపోవడానికి అనుమతి అయినా ఇవ్వాలని బాధితుడు రాష్ట్రపతి ని కోరటం ఇక్కడో ట్విస్ట్. నిజానికి ఈ సంఘటన వెలుగులోకి రాగానే జగన్ ప్రభుత్వం స్పందించి దీనికి కారకుడైన ఎస్ ఐ ని సస్పెండ్ చేసింది. సమగ్ర విచారణకు ఆదేశించింది. కానీ ఈ కేసులో నిందితుల అరెస్టులు ఇంకా జరక్కపోవడం అనేది బాధితునికి మనస్తాపం కలిగించి౦ది.
ఈ నేపథ్యంలోనే బాధితుడు ఆ లేఖ రాశాడు. వివరాలలోకి వెళితే తూర్పుగోదావరిలోని రాజమండ్రి రూరల్ సీతానగరం మండలం వెదుళ్లపల్లి గ్రామంలో ఇసుక రేవుల నుంచి ఇసుకను తీసుకెళ్తున్న లారీలను అతివేగంగా నడుపుతున్నారని, దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామానికి చెందిన దళిత యువకులు కొందరు లారీలను ఆపారు. ఈ విషయం తెలుసుకున్న అధికార పార్టీకి చెందిన నాయకుడు ఒకరు సంఘటన స్థలానికి వచ్చి కారుతో యువకులను ఢీ కొట్టేందుకు ప్రయత్నించగా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
అయితే యువకులే దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారని సీతానగరం పోలీసులకు సదరు నాయకుడు ఫిర్యాదు చేశారు.వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి వరప్రసాద్ అనే దళిత యువకుడిని స్టేషన్కు తీసుకొచ్చారు.పోలీస్ స్టేషన్ లోనే ట్రైనీ ఎస్సై అతనికి శిరోముండనం చేశారు. ఇప్పటికే ఈ ఘటనకు బాధ్యుడైన ఎస్సైను సస్పెండ్ చేశారు. అయినా తనకు న్యాయం జరగలేదని భావించిన ప్రసాద్, రాష్ట్రపతికి లేఖ రాశాడు. శిరోమండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అలా కుదరని పక్షంలో మావోయిస్టుల్లో కలిసిపోవడానికి తనకు అనుమతి ఇవ్వాలని అతడు నేరుగా రాష్ట్రపతిని కోరాడు.మేధావి వర్గాల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది