టిడిపి నేతలను వైసిపి అనవసరంగా పార్టీలోకి చేర్చుకుంటో౦దన అసమ్మతి అధికార పార్టీలో క్రమంగా ప్రబలుతోంది. వైసీపీ లో చేరుతున్న టిడిపి నేతల వల్ల అధికార పార్టీకి
ఏ ఉపయోగం ఉండదని పైగా కొన్ని నష్టాలు కూడా ఎదురు కాగలవని వారు వాపోతున్నారు.ఏపీలో 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి నిలబడి అడ్రస్ లేకుండా ఓడిపోయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు వైసీపీకి ‘క్యూ’ కడుతున్నారు. జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డిని రాజమండ్రిలో చందన రమేశ్ ను వైజాగ్ లో రమేశ్ బాబు వైసీపీలో చేరారు.వీరి వల్ల వైసీపీకి ఖచ్చితంగా నష్టమే జరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఎందుకంటే వారు పార్టీలో చేయడంతోటే గమ్మునుండరు.
తమ ప్రాబల్యం పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు .తమ గ్రూపును కూడా ఏర్పరుచుకుంటారు. పైగా తమ పరపతి ఉపయోగించి ఈ టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పుల్లలు పెడుతూ కాంట్రాక్టులు పనులు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తారు.ఒక మాటలో చెప్పాలంటే వైసీపీ ఎమ్మెల్యేలను తొక్కేసే వరకూ వెళతారు.దీనివల్ల ప్రస్తుతం వారిపై గెలిచిన వైసిపి ఎమ్మెల్యేలకు ఇబ్బందులు తప్పవు.అసలు వాళ్లను చేర్చుకోవాల్సిన అవసరం వైసీపీకి ఇప్పుడు ఏమొచ్చిందన్న ప్రశ్న ఎదురవుతోంది పాలన మారినా ఇంకా టీడీపీ నేతల ఆధిపత్యం ఏంటని వైసీపీ క్షేత్రస్థాయి నేతల్లోనూ నిరసన వ్యక్తమవుతోంది.. ఎన్నికలు అయిపోయిన తరువాత వాళ్ల వల్ల లక్ష ఓట్లు వచ్చినా ఏమీ లాభం అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
వీరిలో కొందరు టిడిపి కోవర్టులు కూడా ఉండవచ్చునని అనుమానాలు మవుతున్నాయి. తప్పకుండా ఇది పార్టీకి నష్టమే అని వైసీపీ వర్గాలు అంటున్నాయి. టిడిపి నిర్వీర్యం చేసే ఉద్దేశ్యంతో వైసిపి నాయకత్వం ఆ పార్టీ వారందరికీ తలుపులు బార్లా తెరిస్తే అంతిమంగా నష్టపోయేది .జగన్ మోహన్ రెడ్డి అని వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా వైసీపీ అధినాయకత్వం ఎవరి వల్ల పార్టీకి ప్రయోజనం ఉంటుందో వారిని చేర్చుకోవాలని, సంఖ్యా బలం కోసం సత్తా లేని వారిని చేర్చుకొని కొత్త సమస్యలు కొని తెచ్చుకోవద్దని వైసిపి సీనియర్లు జగను కి సలహా ఇస్తున్నారు!