ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తిరుపతి ఉప ఎన్నిక చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆలయాలలో విగ్రహాల ధ్వంసం వంటి ఘటన ల చుట్టూ ప్రతిపక్ష అధికార పార్టీలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నాయి. చాలావరకూ ఆలయాలలో విగ్రహాల ధ్వంసం చేసేది ప్రతిపక్షాలన్నీ ఏపీ ప్రజానీకమంతా అనుకుంటున్నట్లు రాజకీయ వర్గాలలో టాక్.
వైసీపీ ప్రభుత్వం పై ఎటువంటి విమర్శలు చేసే రీతిలో చాన్స్ లేని నేపథ్యంలో, ఈ విధమైన మార్గాన్ని ఎంచుకుని ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి జరగబోయే తిరుపతి ఉప ఎన్నికల్లో ఓట్లు సంపాదించడానికి రాజకీయ పార్టీలు ఈ విధమైన రాక్షస మత రాజకీయ క్రీడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరోపక్క తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అన్న దాని విషయంలో సర్వే లో అప్పుడే స్టార్ట్ అయిపోయాయి.
ఈ క్రమంలో తెలుగు వెబ్ సైట్ రంగంలో పేరుగాంచిన ఓ వెబ్సైట్ చేసిన సర్వేలో వచ్చిన ఫలితాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మతవిద్వేషాలు పరంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేనట్లు ఈ సర్వేలో తేలిందట. అధికార పార్టీ వైసీపీకి ఏకంగా 44.39శాతం ఓట్లు వస్తాయని.. అధికార పార్టీ గెలవడం గ్యారెంటీ అని సర్వేలో తేలింది. ఇక ప్రతిపక్ష పార్టీ టిడిపి పార్టీ పరిస్థితి చూస్తే 24.37 శాతం ఓట్లతో మూడో స్థానంలోకి పడిపోతుందని, బిజెపి జనసేన కూటమి పరిస్థితి చూస్తే 27.76శాతం మంది ప్రజలు మద్దతు తెలుపుతారని ఈ సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా తిరుపతి పార్లమెంటు రిజర్వుడు నియోజకవర్గం కావడంతో మత రాజకీయాలు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని మరోపక్క విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే గత ఎన్నికలలో గెలిచిన మెజారిటీ కంటే ఈ సారి ఉప ఎన్నికలలో భారీ స్థాయిలో మెజారిటీ సాధించాలని వైసిపి పార్టీ వ్యూహాలు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చిన రిజల్ట్ కి ఢిల్లీ నుండి గల్లీ దాకా ఏ నేత నోట్లో నుండి మాట రాకూడదని జగన్ తిరుపతి ఉప ఎన్నికల విషయంలో చాలా సీరియస్ గా ఉన్నట్లు పార్టీలో అంతర్గతంగా వినబడుతున్న టాక్.