టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది నిర్మొహమాటంగా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. దర్శకుడు తేజ ది కూడా అలాంటి నైజమే. ఎవరీకీ భయపడడు ఎవరేమనుకుంటారో అని అసలు ఆలోచించడు. ఇది ఆయనకి మొదటి నుంచి ఉన్న మనస్తత్వం. చిత్రం సినిమాతో దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకి వచ్చిన తేజ సీత సినిమా వరకు ఎన్నో హిట్ సినిమాలతో పాటు డిజాస్టర్లు తీశాడు. అయితే హిట్టొచ్చిన ఫ్లాపొచ్చినా ఎప్పుడు ఒకేలా ఉంటారు…ఒకేలా స్పందిస్తారు. ఇక ఆయనని ఏ విషయంలో నైనా తన అభిప్రాయం అడిగితే తన మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు.
ఇప్పుడు కూడా ఒక విషయంలో ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి మరో వైపు నందమూరి బాలకృష్ణ లాంటి లెజెండ్స్ ఉన్నా కూడా తనకి అనిపించినదే చెప్పి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. రీసెంట్ గా చిరంజీవి బృందం తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్ ను కలిసి సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక విషయాలపై చర్చించడం అందరికీ తెలిసిందే. అయితే ఈ చర్చలకి బాలయ్యని పిలవకపోవడం ఇండస్ట్రీలో సంచలనం అయింది.
ఈ విషయంలో స్పందిస్తూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు కాస్త వివాదానికి దారితీశాయి. ఇదే విషయంలో దర్శకుడు తేజ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి బాలయ్య కి సపోర్ట్ గా నిలిచాడు. వ్యక్తిగతమైన చర్చలకైతే ఎవరూ ఎవరినీ పిలవాల్సిన అవసరం లేదని తేజ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కాని ఇది పరిశ్రమకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే సమయం కాబట్టి బాలయ్యనే కాదు.. పరిశ్రమకు ఎవరైతే ముఖ్యమైన పిల్లర్స్ లా ఉన్నారో వారందరినీ పిలవాలని అభిప్రాయపడ్డారు. అయితే తేజ అభిప్రాయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. కాని ఈ వ్యాఖ్యలకి మెగా ఫ్యాన్స్ గాని మెగా బ్రదర్స్ గాని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి అంటున్నారు.