టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న అగ్ర హీరోలలో నాగార్జున ఒకరు. తన విలక్షణమైన నటనతో ఫ్యాన్స్ ఫాలోయింగ్ను ఏర్పరచుకున్న ఈ అక్కినేని వారసుడు భక్తి సినిమాలు చేసి అసలుసిసలైన భక్తుడిగా, లవ్ స్టొరీ మూవీలు చేసి గ్రీకువీరుడు గా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇలా ఎప్పడికప్పుడు కొత్త తరహా కథలు విలక్షణ పాత్రలతో తెలుగు ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తున్న నాగ్ మల్టీస్టార్ మూవీస్ కూడా చేసి విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇక తాజాగా వైల్డ్ డాగ్ చిత్రం షూటింగ్ కూడా పూర్తి చేసిన కింగ్ త్వరలో మరో బాలీవుడ్ సినిమాను టాలీవుడ్లో నిర్మించే ప్రయత్నంలో ఉన్నాడని గత కొన్ని రోజులుగా ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే.
ఆ సినిమానే బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన రైడ్. హిందీలో అజయ్ దేవ్ గన్, ఇలియానా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు రాబట్టిది. అందుకే ఈ సినిమాని తెలుగులో చేయడానికి నాగార్జున్ డిసైడయ్యాడు. కాగా ఇప్పుడు ఈ సినిమాని తెరకెక్కించేందుకు సరైన దర్శకుడి కోసం వేటలో ఉన్నాడని చెప్పుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ప్రవీణ్ సత్తారు ఈ చిత్రాన్ని డైరెక్టర్ చేస్తాడని వార్తలు వినిపించినా అందుకు సంబంధించి అఫీషియల్ న్యూస్ ఏదీ లేదు.
ఆ తర్వాత డైరెక్టర్ ప్రభు సోలోమన్ దగ్గరకు వెళ్లిన రైడ్ రీమేక్ పట్టాలు తప్పి ఈ దర్శకుని ఒరిజినల్ స్క్రిప్ట్ తో వైల్డ్ డాగ్ తెరకెక్కింది. ఇక ఈ చిత్రం కూడా పూర్తవడంతో నాగార్జున రైడ్ ను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఒకవేళ రైడ్ చిత్రాన్ని తెలుగులో చేసి హిట్ ఇస్తే హిందీ సినిమాని తెలుగులో తీసి హిట్ కొట్టాడు కాబట్టి ఆ డైరెక్టర్ టాలెంట్ కి బాలీవుడ్ లో ఆఫర్ రావడం గ్యారెంటీ అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇకపోతే టాలీవుడ్లో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రాస్గా మారిన నాగ్.. రిస్క్ చేసి మరీ కొత్త దర్శకులతో సినిమాలు చేసి సక్సెస్ సాధించారు. ఈ క్రమంలోనే రైడ్ తెరకెక్కించే బాధ్యతలు ప్రవీణ్ సత్తారు కి అప్పగించినట్టు తెలుస్తోంది.