బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న ఎవరికీ ఆ తర్వాత కెరీర్ అంత గొప్పగా ఉండదన్న టాక్ తెలుగులో మూడు సీజన్స్ కంప్లీటయ్యాక కూడా వచ్చిన సంగతి తెల్సిందే. ఒకరకంగా చెప్పాలంటే చాలామంది విషయంలో ఇది నిజమే అనిపిస్తుంది. కాని సీజన్ 4 అది తప్పు అని ప్రూవ్ చేసింది. బిగ్ బాస్ సీజన్ 3 కి హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున ఇప్పుడు సీజన్ 4 కి హోస్ట్ గా వ్యవహరిస్తూ సక్సస్ ఫుల్ గా షో ని తుది దశకి తీసుకు వచ్చాడు. చెప్పాలంటే గత మూడు సీజన్స్ కంటే ఈ సీజన్ విషయంలో ఎన్నో అపోహలు.. అనుమానాలు కలిగాయి. అందుకు కారణం కరోనా.
కాని కింగ్ అన్నిటికి చెక్ పెట్టి బిగ్ రియాలిటీ షో ని తన భుజాల మీద మోశాడు. కాగా ఈ సీజన్ లో ఇద్దరు హాట్ బ్యూటీస్ కి టాలీవుడ్ నుంచి మంచి అవకాశాలు వస్తున్నాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ ఇద్దరే దివి, మోనాల్ గజ్జర్. మోనాల్ గజ్జర్ కంటే ముందే బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చిన దివి కి ఇప్పటికే రెండు సినిమాలలో హీరోయిన్ గా ఒక సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో ఛాన్స్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే దివి రెండు ప్రాజెక్ట్స్ కి సైన్ కూడా చేసిందని కూడా చెప్పుకుంటున్నారు. త్వరలో ఈ రెండు ప్రాజెక్ట్స్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతుందట.
ఇక మోనాల్ గజ్జర్ ప్రస్తుతం పలు యూట్యూబ్ ఛానల్స్ లో వరసగా ఇంటర్వ్యూస్ ఇస్తూ హడావుడిగా ఉంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ సినిమాల నుంచి మోనాల్ కి ఆఫర్ వస్తున్నట్టు ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చింది. ఈ లెక్కన చూస్తే ఈ ఇద్దరి బ్యూటీస్ కి తెలుగు సినిమాలలో బాగానే ఆఫర్స్ వస్తున్నాయి అని అర్థమవుతోంది. అంతేకాదు ఇన్నాళ్ళు బిగ్ బాస్ షో మీద ఉన్న నెగిటివ్ సెంటిమెంట్ కూడా ఈ దెబ్బతో బ్రేక్ అవుతుంది. కాగా గ్రాండ్ ఫినాలే కి మెగాస్టార్ చిరంజీవి ఛీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. వీరితో పాటు మరికొందరు టాలీవుడ్ స్టార్స్ కూడా గ్రాండ్ ఫినాలే లో సర్ప్రైజ్ చేయబోతున్నారని అంటున్నారు.