తెలుగు బుల్లితెరపై వరుసపెట్టి కామెడీ షో లు వస్తున్నాయి అయితే వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటున్నాయి. జబర్దస్త్ అన్నింటికన్నా టాప్ లో ఉంది అని చెప్పబన్లేదు. దాదాపు 8 ఏళ్లుగా టెలివిజన్ రంగంలో తన ప్రభావాన్ని చూపించిన ఈ షో ఇప్పటికీ నెంబర్ వన్ స్థానం లోనే ఉంది. ఇక మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ కి వచ్చేసిన తర్వాత సరికొత్త షో కు శ్రీకారం చుట్టారు.
ఇక ఆ షో కు సంబంధించిన తాజా ప్రోమో లో నిహారిక శ్రీముఖి ముందు నాగబాబు ప్రవర్తించిన తీరు షాకింగ్ ఉంది అని అంటున్నారు. తెలుగులో తొలి స్టాండప్ కామెడీ షో గా చెప్పబడే ఖుషి ఖుషీగా కోసం 30 మందిని సెలెక్ట్ చేస్తారు నాగబాబు. వీళ్లంతా జడ్జీల ముందు పర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. వారిలో 10 మందిని సెలెక్ట్ చేసి మెగా ఫైనల్ నిర్వహిస్తారు. వారి నుండి ముగ్గురిని విజేతగా ప్రకటించి వాళ్లకు ప్రైజ్ మనీ తో పాటు వెబ్ సిరీస్ లో కూడా అవకాశం కల్పించబోతున్నారట.
ఇక ఈ షోలో కంటెస్టెంట్ లిస్ట్ రెడీ అయింది. ఈ క్రమంలో నాగబాబు వాళ్ళ పర్ఫార్మెన్స్ వీడియో ని వదిలారు అయితే అందులో కంటెస్టెంట్ లు అందరూ డబల్ మీనింగ్ డైలాగ్స్ బూతులు తో రెచ్చిపోయారు. చివర్లో వీటిని బూతులు అనుకుంటే బూతులాగా డైలాగులు అనుకుంటే కామెడీ లా అనిపిస్తాయి అని భాస్కర్ పేర్కొన్నాడు. ఈ వీడియోలో కమెడియన్ ధనరాజ్, సద్దాం, వేణు, బుల్లెట్ భాస్కర్ కనిపించారు. యాంకర్ శ్రీముఖి, నిహారిక కూడా ఉన్నారు ఇక వారి పక్కనే ఉన్న నాగబాబు సొంత కూతురి పక్కన డబల్ మీనింగ్ డైలాగ్స్ ఉచ్చరించడం తో అందరూ పగలబడి నవ్వారు. ఈ క్రమంలో నిహారిక తన కాలేజీలో జరిగిన అనుభవం కూడా పంచుకుంది.