చిరంజీవి ..కొరటాల శివ కాంబినేషన్ లో ఆచార్య తెరకెక్కుతోంది. సైరా లాంటి పాన్ ఇండియన్ సినిమా తర్వాత chiranjeevi నుంచి వస్తున్న ఆచార్య మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. koratala siva సక్సస్ ట్రాక్ రికార్డ్ కూడా అందుకు ముఖ్య కారణం. chiranjeevi ని ఆచార్య సినిమాలో కొరటాల శివ ఎలా చూపించబోతున్నాడో ఎంత పవర్ ఫుల్ రోల్ లో నటింప చేస్తున్నాడో అన్నదే అందరిలో ఉన్న ఆసక్తి. అందుకు తగ్గట్టుగానే మోషన్ పోస్టర్ తో ఉన్న అంచనాలను ఊహకందనంతగా పెంచాడు koratala siva.
కాగా chiranjeevi ఆచార్య సినిమాతో పాటు మరో రెండు సినిమాలని చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ రెండు సినిమాలు రీమేక్ సినిమాలే. ఒక సినిమా తమిళ సూపర్ హిట్ వేదాళం అయితే మరో సినిమా మలయాళ సూపర్ హిట్ లూసీఫర్. ఈ రెండు సినిమాలని chiranjeevi రీమేక్ చేస్తున్నట్టు ఎప్పుడో వెల్లడించాడు. కాని ఈ రెండు ప్రాజెక్ట్స్ లో చిరంజీవి ఏది ముందు మొదలు పెట్టాలో పెద్ద కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. chiranjeevi లాంటి వాళ్ళే ఇలా కన్ఫ్యూజ్ లో పడితే మిగతా వాళ్ళ పరిస్థితేంటి అని మాట్లాడుకుంటున్నారట.
వాస్తవంగా chiranjeevi ఆచార్య తర్వాత లూసీఫర్ మొదలవ్వాల్సింది. కాని దర్శకుడు విషయంలో క్లారిటీ లేకపోవడంతో వేదాళం ముందు మొదలబోతుందని వార్తలు వచ్చాయి. ఈ సినిమాని మెహర్ రమేష్ తెరకెక్కించబోతుండగా ఇప్పటికే పక్కాగా స్క్రిప్ట్ తో రెడీ ఉన్నాడని సమాచారం. కాగా రీసెంట్ గా మోహన్ రాజా ని లూసీఫర్ తెలుగు రీమేక్ కి దర్శకుడిగా ఫైనల్ చేశారు. ప్రస్తుతం మోహన్ రాజా స్క్రిప్ట్ ని ఫైనల్ వర్షన్ రెడీ చేసే పనిలో ఉన్నాడట. ఈ క్రమంలోనే chiranjeevi ఏ ప్రాజెక్ట్ ముందు మొదలు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో ఈ విషయంలో క్లారిటీ రానుందని తెలుస్తోంది.