యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మంచి ఊపు మీదున్నాడు. ఒకటి కాదు రెండు కాదు వరుసగా నాలుగు సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాలకు తెరలేపిన ప్రభాస్ వరుసగా తెలుగులో.. కన్నడలో.. బాలీవుడ్లో సినిమాలు చేస్తూ అందరినీ అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఆది పురుష్ సినిమాతో బాలీవుడ్ లో డైరెక్ట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ప్రభాస్. ఈ భారీ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే పూజా హెగ్డే తో రాధే శ్యామ్ చేస్తున్నాడు. ఇక దర్శకుడు ప్రశాంతి నీల్ తో కలిసి సలార్ మూవీ చేస్తున్నాడు.
ఈ మూవీ తో పాటే నాగ్ ఆశ్విన్ తో మరో మూవీ కి కమిట్ అయ్యారు. వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న డార్లింగ్ ప్రభాస్… ఎన్ని సినిమాలు నటించిన ఫాన్స్ మాత్రం ఒక విషయంలో అప్ సేట్ అవుతున్నారట. బిల్లా, మిర్చి, బాహుబలి సినిమా ద్వారా మంచి కెమిస్ట్రీ ఉన్న జోడిగా ప్రభాస్ అనుష్క నిలిచారు. వీరి జోడీకి ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. అప్పట్లో ఎక్కడ కనిపించినా ప్రభాస్ అనుష్క ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అన్న రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అయితే ప్రభాస్ ఎన్ని సినిమాలు చేస్తున్నా అందులో హీరోయిన్ గా అనుష్క కనిపించడం లేదన్న వెలితే ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. బాలీవుడ్ స్టార్స్ ప్రభాస్ పక్కన నటించిన అనుష్క లెవెల్ వేరే అంటూ అభిమానులు అంటున్నారట. అయితే అనుష్క మాత్రం ప్రస్తుతం ఏ సినిమా చేయడం లేదు. నిశ్శబ్దంతో సైలెంట్ హిట్ కొట్టిన అనుష్క ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలోనూ నటించడం లేదని అంటున్నారు. మరి అనుష్క ను ప్రభాస్ చేస్తున్న ఏ ప్రాజెక్ట్ లో కూడా ఎందుకు తీసుకోవడం లేదన్న ప్రశ్న అభిమానుల నుంచి వ్యక్తమవుతోందట.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!