నిజానికి మాసాలలో చైత్రం మొదటిది ఆ మాసంలో వచ్చే ఏకాదశిని తొలిది కాబట్టి తొలి ఏకాదశి అనాలి కానీ అలా పిలువరు. ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మాత్రమే తొలి ఏకాదశిగా పరిగణించి అక్కడి నుంచి తిరిగి ఆషాఢమాసం వచ్చేవరకు ఉండే ఏకాదశులను ఆయా పేర్లతో పిలుస్తు వ్రతాలను ఆచరిస్తారు.
ఇక ఈ ఏకాదశులుఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్ల పక్షంలో రెండోది బహుళ (కృష్ణ)పక్షంలో వస్తాయి. ఇక అధికమాసం వస్తే మరో రెండు అధికంగా అంటే 26 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఒక్క హిందువు తప్పనిసరిగా ఆచరించాల్సిన వ్రతాలల్లో ఏకాదశి . చాలా పవిత్రమైంది. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా గా పిలుస్తారు.
దీనికే శయనైకాదశి అని హరి వాసరమని, పేలాల పండుగ అని పేరు. పురాణాలను అనుసరించి శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు.. అలా నాలుగు నెలల పాటు ఆయన పడుకుని.. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధినీ ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు. ఈ ఏకాదశి నుంచి సూర్యగమనం లేదా భూగమనంలో మార్పులు వస్తాయి. దక్షిణాయనం ప్రారంభమవుతుంది. అందుకే దీనికి అంత ప్రత్యేకత ఇస్తారు.