డార్లింగ్ ప్రభాస్ గురించి ఈరోజు దేశం మొత్తం మాట్లాడుకుంటుందంటే అది బాహుబలి ఫ్రాంఛైజీ తో వచ్చిన అసాధారణమైన క్రేజ్ వల్లనే అని ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఈ సినిమాతో టాలీవుడ్ లో ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. అంతేకాదు ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్ని కనీసం 300 కోట్ల బడ్జెట్ కి ఏమాత్రం తగ్గడం లేదు.
ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధే శ్యామ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. 2020 డిసెంబర్ వరకు ఈ సినిమాని కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. గోపికృష్ణ మూవీస్, యూవి క్రియోషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. వైజయంతి మూవీస్ బ్యానర్ లో 50 వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనుంది. ప్రభాస్ కి జంటగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపక పదుకొణె నటిస్తుంది.
ఇక రీసెంట్ గా ఆదిపురుష్ టైటిల్ తో మరో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు ప్రభాస్. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. అలాగే మరో బాలీవుడ్ సీనియ హీరో సైఫ్ అలీఖాన్ లంకేష్ అన్న పాత్రలో నటించబోతున్నట్టు అధికారకంగా ప్రకటించారు. ఈ సినిమాని హాలీవుడ్ లోను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అయితే వసరగా భారూ సినిమాలని అనౌన్స్ చేస్తున్న ప్రభాస్ గురించి ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. లాక్ డౌన్ లో రానా, నితిన్, నిఖిల్ లాంటి యంగ్ హీరోలు పెళ్ళి చేసుకొని ఒక ఇంటివారైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అయిన ప్రభాస్ పెళ్ళి ఎప్పుడు అని అడుగుతున్నారట. కాని ప్రభాస్ ఇందుకు ఇంకాస్త సమయం ఉందని అంటున్నాడట గాని ఖచ్చితంగా ఎప్పుడు చేసుకుంటాడో మాత్రం చెప్పడం లేదని అభిమానులు చెప్పుకుంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?