ఐఏఎస్ వర్గాల్లో కొన్ని పోస్టులపై ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఈ విష్యంలో ఏపీ విషయానికొచ్చేసరికి చీఫ్ సెక్రటరీ తర్వాత ఎవరైనా ప్రధానంగా కోరుకునే పోస్టు టీటీడీ ఈవోనే అంటారు. ఈ క్రమంలో చంద్రబాబు హయాంలో చాలా మంది అధికారులు పోటీ పడినప్పటికీ.. ఆయన అనిల్ కుమార్ సింఘాల్ కు చాన్సిచ్చారు. నాటినుంచి మొదలు సింఘాల్ ఆ కుర్చీ దిగడం లేదు! దీనివల్ల జగన్ ప్రభుత్వంపై ఉన్న ఒక అపవాదు తొలగిందనే టాక్ రాజకీయవర్గాల్లో మొదలైపోయింది.
తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పదవీ కాలం పొడిగిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే మొదటిసారి కాదు.. ఏడాది కిందట కూడా ఓ సారి ఇలానే పొడిగించారు. దీంతో తెలుగుదేశం పార్టీ హయాంలో నియమితులైన కీలక అధికారుల్ని… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే తప్పించేస్తోంది.. ఎస్.ఇ.సి. రమేష్ కుమార్ ఉదంతమే ఇందుకు సాక్ష్యం అంటూ వస్తోన్న ఆరోపణలకు.. సింఘాల్ పదవీ కాలం పొడిగింపే సమాధానం అని అప్పుడే వైకాపా నాయకుల నుంచి సమాధానాలు మొదలైపోయాయి!
కాగా… ఢిల్లీలోని ఏపీ భవన్ లో రెసిడెంట్ కమిషనర్ గా పనిచేస్తున్న సింఘాల్ ను 2017 మేలో చంద్రబాబు ప్రభుత్వం టీటీడీ ఈవో గా నియమించింది. మామూలుగా అయితే రెండేళ్లు మాత్రమే ఈ పోస్ట్ పదవి కాలం. కానీ… తనకు వ్యక్తిగత కక్షలు, రాజకీయ కక్ష సాధింపులు, వ్యక్తిగత అభిప్రాయాలతో సంబందం లేదు.. సమర్ధులను కొనసాగిస్తాను.. అసమర్ధులను తొలగిస్తాను అన్న విధంగా జగన్ ఆలోచనలు ఉన్నయని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ అని వైకాపా నేతలు ఈ సందర్భంగా ప్రస్థావించడం మొసమెరుపు! ఆ కారణంతోనే సింఘాల్ ను జగన్ కదిలించడంలేదని అంటున్నారు!