ప్రముఖ రచయిత పోసాని కృష్ణ మురళి స్కూల్ నుంచి వచ్చిన దర్శక, రచయిత కొరటాల శివ. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మిర్చి సినిమాతో దర్శకుడిగా మారి మొదటి సినిమాతోనే సక్సస్ అందుకున్నాడు. దాంతో వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేసే అవకాశం అందుకున్నారు. శ్రీమంతుడు సినిమాతో సూపర్ స్టార్ కి మంచి క్లాస్ హిట్ ఇచ్చాడు. ఈ సినిమాలో మహేష్ బాబు ని చూపించిన విధానానికి ఇండస్ట్రీ వర్గాల నుంచి గొప్ప ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇక ఫ్యాన్స్ అయితే కొరటాల ని పొగడ్తలతో ముంచేశారు.
ఇలా వరసగా ప్రభాస్, మహేష్ బాబు లకి వరసగా బ్లాక్ బస్టర్స్ ఇవ్వడంతో టాలీవుడ్ నుంచి స్టార్స్ అందరూ కొరటాలతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే జనతా గ్యారేజ్ కథ చెప్పి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ని ఇంప్రెస్ చేశాడు. మూడో బ్లాక్ బస్టర్ కొరటాల అకౌంట్ లో పడింది. ఇక శ్రీమంతుడు సినిమా సమయంలోనే కొరటాల మహేష్ బాబు కి భరత్ అనే నేను లైన్ చెప్పి ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టుకున్నాడు.
జనతా గ్యారేజ్ సూపర్ హిట్ తర్వాత భరత్ అనే నేను సినిమాతో ఇద్దరు మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అయితే ఈ సినిమాలన్నిటికి మ్యూజిక్ అందించింది రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్. ఇన్ని సక్సస్ లకి కారణం దేవీ అని కూడా చెప్పుకున్నాడు కొరటాల. కాని ఉన్నపలంగా కొరటాల మెగాస్టార్ చిరంజీతో చేస్తున్న ఆచార్య సినిమాకి దేవీ ని కాకుండా మణిశర్మ ని తీసుకొని షాకిచ్చాడు. వాస్తవంగా కొరటాల, దేవీ ల మద్య ఎంత బాండింగ్ ఉందో… మెగాస్టార్, దేవీ ల మద్య కూడా అలాంటి బాండింగ్ ఉంది. అందుకే అందరూ.. ఈ ముగ్గురు కాంబినేషన్ లోనే ఆచార్య వస్తుందని భావించారు.
కాని కొరటాల ఆచార్య సినిమాతో ఆ సెంటిమెంట్ ని వదిలేశాడు. ఈ సినిమాకి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నారు.
ఇప్పటికే ఆచార్య కి 5 పాటలు కంపోజ్ చేశారు మణిశర్మ. వాటిలో ఒక స్పెషల్ సాంగ్ ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, రెజీనాల మీద చిత్రీకరణ పూర్తయింది. పదేళ్ళ తర్వాత మెగాస్టార్ సినిమాకి మ్యూజిక్ అందించిన మణిశర్మ అద్భుతమైన సాంగ్స్ ఇవ్వడంతో కొరటాల నెక్స్ట్ చేయబోతున్న అల్లు అర్జున్ సినిమాకి మణిశర్మ నే మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేసుకున్నారట.