ఛలో సినిమాతో దూసుకొచ్చింది కన్నడ బ్యూటి రష్మిక మందన్న. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ అమ్మడు గీత గోవిందం సినిమాతో టాలీవుడ్ లో సెటిలైపోయింది. విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరడంతో రష్మిక టాలీవుడ్ కి లక్కీ హీరోయిన్ అయిపోయింది. అంతేకాదు పూజా హెగ్డే తో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పోటీ పడుతోంది.
ఆ పోటీలో బాగానే దూసుకు వచ్చింది. పూజా హెగ్డే అల వైకుంఠపురములో చేస్తే రష్మిక మందన్న సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు లో అవకాశం అందుకొని అందరికి షాకిచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే రీసెంట్ గా నితిన్ సరసన నటించిన భీష్మ కూడా మంచి కమర్షియల్ హిట్ అందుకుంది. ఇక తాజాగా సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం రష్మిక చేతిలో ఉంది తెలుగులో ఇదొక్కటే సినిమా.
తమిళంలో ఒక సినిమా అలాగే తన మాతృభాష కన్నడ లో ఒక సినిమా చేస్తుంది. అయితే సరిలేరు హిట్ అయిన దగ్గర్నుంచి సూపర్ స్టార్ నెక్స్ట్ సినిమాలో కూడా రష్మిక నే తీసుకుంటారన్న భావనలో ఉందట. కాని తాజాగా వినిపిస్తున్న దాని బట్టి ఆ ఛాన్స్ లేదని తెలుస్తుంది. దానికి తోడు కరోనా కారణంగా చిత్ర పరిశ్రమలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే వాళ్ళని సైడ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు కీర్తి సురేష్, పూజా హెగ్డే లాంటి వాళ్ళ తాకిడి ..మళ్ళీ ఫాం లోకి వస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ …ఇవన్ని చూస్తూ రకుల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అని తెగ టెన్షన్ పడుతుందట.