పెళ్ళాన్ని తిట్టాడని పనిచేసే చోటా తనపై అధికారిని చంపేసిన ఘటన ఇటీవల బెంగళూరులో చోటు చేసుకుంది. పూర్తి విషయంలోకి వెళ్తే బెంగుళూరులో లో ఓ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్ లో ప్రశాంత్ అనే వ్యక్తి మేనేజర్ గా పని చేస్తున్నాడు. అదే సంస్థలో సోమశేఖర్ అలియాస్ సోమ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అయితే పనిలో భాగంగా పై నుంచి ఒత్తిడి రావడంతో మేనేజర్ ప్రశాంత్ డ్రైవర్ సోమా కి ఫోన్ చేసి గొడవకి దిగాడు. అయితే ఆ సమయంలో ఫోన్ సోమ ఎత్తకుండా అతను భార్య మేనేజర్ ప్రశాంత్ తో మాట్లాడటం జరిగింది. ఆ సమయంలో ప్రశాంత్ సోమ భార్య తో అసభ్యకరంగా బూతులు మాట్లాడటం తో, పాటు ఆమెను అవమాన పరిచేలా విమర్శలు చేయడంతో విషయం మొత్తం భర్త సోమకి తెలిపింది.
దీంతో తన పెళ్ళాన్ని మేనేజర్ తిట్టడంతో కోపంతో డ్రైవర్ సోమ ఆర్ ఎం సి పరిధిలోని ఆఫీస్ కి వెళ్లి అక్కడ ఉన్న మేనేజర్ ప్రశాంత్ తో నేరుగా గొడవకు దిగాడు. ఫోన్ చేసి ఎవరితో ఎలా మాట్లాడాలో నీకు తెలియదా? అయినా సరే ఆడవాళ్ళతో అలాంటి మాటలు మాట్లాడటం ఏంటి అంటూ ప్రశాంతి నిలదీయడంతో ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో వెంటనే డ్రైవర్ సోమ మేనేజర్ ప్రశాంత్ ని కత్తితో పొడిచి చంపేశాడు.
విచక్షణ రహితంగా దాడి చేయడంతో ప్రశాంత్ అక్కడికక్కడే ప్రాణాలు విడవటం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో ఇటీవల రావటంతో పెళ్ళాం మీద నీకు ఎంత ప్రేమ రా బాబు అని డ్రైవర్ ని తిట్టాలో తిట్టకూడ దో అన్నట్టుగా నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. చాలావరకు ఇటీవల అక్రమ సంబంధాలు పెట్టుకున్ననా భార్యలా విషయాలలో అవతల వ్యక్తిని భర్త చంపేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ తాజాగా భార్యపై ప్రేమతో ఒక వ్యక్తిని, పైగా అది విమర్శించడని చంపడంతో ఈ వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.