ఒ మహిళ గొడవ పడిన భర్తపై బండరాయి విసిరింది. అది కాస్తా అతని ఆయువు పట్టు పై తగలడంతో అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఈ హఠాత్ పరిణామంతో ఏమి చేయాలో తెలియక ఆమె పలాయనం చిత్తగించింది. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది.
వివరాలలోకి వెలితే…. తమిళనాడు ఈ రోడ్ జిల్లాకు చెందిన ప్రావిన్స్ జేవియర్, మథలాయీ మేరిలకు 22 ఏళ్ల క్రితం పెళ్లి అయ్యింది. వీరికి నలుగురు సంతానం. కొన్ని సంవత్సరాల వరకు వీరి సంసారం సాఫీగానే సాగింది. కాని కొన్ని కారణాల వల్ల వీరి మద్య విభేదాలు తలెత్తాయి. దాంతో మేరి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి పోయింది. పిల్లలతో కలిసి ఉంటోంది.
ఇటీవల ప్రావిన్స్ తన భార్య కోసం అత్తవారింటికి వెళ్లడంతో అక్కడ తీవ్ర గొడవ జరిగింది. చివరకు ఇద్దరి మద్య వివాదం తారా స్థాయికి చేరడంతో మేరి చేతికి అందిన రాయిని ప్రావిన్స్పై విసిరింది. ఆ రాయి బలంగా తగలడంతో ప్రావిన్స్ అక్కడికక్కడే మృతి చెందాడు. దింతో ఖంగు తిన్న మేరి వెంటనే అక్కడ నుండి పారిపోయింది. పరారీలో ఉన్న ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?