కాలం మారుతున్న కొద్దీ సమాజంలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మార్పులు మాములుగా ఉంటే బాగానే ఉంటుంది కానీ ప్రస్తుతం ఆ మార్పులు విపరీతధోరణులకు దారీతీస్తున్నాయి. మరీ ముఖ్యంగా మానవ బంధాలను మంట కలుపుతున్నాయి. ఒకే కుటుంబానికి చెందినవారే మరింత క్రూరంగా మారుతూ.. కసాయి చేష్టలకు ఒడిగడుతూ.. ప్రాణాలు బలితీసుకుంటున్నారు.
మరీ ముఖ్యంగా మహిళలకు అత్తింటివారు పెట్టే ఇబ్బందులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. జీవితాంతం తనకు తోడుగా ఉంటానననీ, మూడు ముళ్ల బంధంతో ఒట్టేసిన ఓ భర్త.. భార్య పట్ల అతి క్రూరంగా ప్రవర్తించాడు. తన భార్య మంట్లల్లో కాలుతుంటే.. తనను ఎలాగైనా కాపాడాల్సింది పోయి.. మానవ మృగంలా మారి ప్రవర్తించాడు. మంటల్లో కాలుతూ.. ఆక్రందనలు పెడుతున్న ఆ మహిళను కాపడకుండా.. ఆ దృశ్యాలను సెల్ఫోన్లో వీడియో తీశాడు ఓ కసాయి భర్త.
అంతటితో ఆగకుండా ఆ మీడియోను బాధిత మహిళ కుటుంబానికి పంపాడు ఆ రాక్షసుడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్లోని ఝన్ఝన్ జిల్లాలో చేటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝన్ఝన్ జిల్లాకు చెందిన ఓ వివాహితను పెళ్లి జరిగినప్పటి నుంచి అత్తింటివారు వేధింపులకు గురిచేశారు. కట్టుకున్న భర్త సైతం ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించేవాడు. ఈ నేపథ్యంలోనే వేధింపులు తాళలేక సదరు మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
అక్కడే ఉన్న ఆమె భర్త.. భార్య మంటల్లో కాలిపోతున్న పట్టించుకోకుండా రాక్షసునిలా ప్రవర్తించాడు. ఆమె మంటల్లో కాలిపోతున్న పట్టించుకోకుండా.. సంబంధిత దృశ్యాలను తన సెల్ఫోన్లో రికార్డు చేయడంతో పాటు, మృతురాలి కుటుంబానికి ఆ వీడియోను పంపించాడు ఆ దుర్మార్గుడు. చుట్టుపక్కల వారు దీనిని గమనించి.. బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా.. .చికిత్స పొందుతూ.. ప్రాణాలు విడిచింది. విషయం తెలుసుకున్న పోలీసులు గృహ హింస చట్టం కింద కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.