రోజులు పూర్తిగా మారిపోయాయి. కరోనా వైరస్ వచ్చాక చాలా మంది మగవాళ్ళు ఇంటిలో ఉండలేక ఇబ్బందులు ఎదుర్కొంటూ మానసిక వ్యాధులకు గురవుతున్నారు అని కొన్ని పరిశోధనల్లో లెక్కలు చెబుతున్నాయి. అంతటికీ కారణం చూస్తే ఇంట్లో ఉండే ఆడవాళ్ళ నస. ఒకానొక టైంలో పూర్వం రోజుల్లో మొగుళ్ళు…. ఆడవాళ్ల ను వంటగదిలో పట్టుకుని చితకబాది ఇల్లు దాటనిచ్చేవారు కాదు. ఆ రోజులలో కనీసం అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ఆడవాళ్లు అప్పట్లో ఉన్న భర్త దెబ్బలకు చాలావరకు సైలెంట్ అయ్యి పద్ధతిగా ఉండేవారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తమ్ మారిపోయింది.
ప్రస్తుతం ప్రభుత్వలలో మరియు చట్టాలలో ఆడవాళ్ళ పట్ల ఎక్కువ సపోర్ట్ ఇచ్చే విధంగా రూల్స్ ఉండటంతో ఆడవాళ్ళ ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది. గతంలో లాగా కాకుండా మగవాళ్లకు అన్ని రంగాలలో పోటీ ఇస్తూ వస్తున్నారు. చాలా వరకు ప్రశ్నించే స్థాయికి ఎదిగిన ఆడవాళ్ళు చాలాచోట్ల మగవాడిని నిలదీసే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా కోల్ కత నగరంలో చాలా డిఫరెంట్ సంఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్రానికి చెందిన జ్యోతిర్మయి మజుందార్ తన భార్యతో కలిసి కోల్ కత నగరంలో నివాసం ఉంటున్నాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నా ఇతగాడు రాష్ట్రంలో కరోనా వైరస్ బాగా విజృంభిస్తున్న తరుణంలో తన తల్లిదండ్రులను ఇంటికి తీసుకురావడానికి ప్రయత్నించాడు. వెంటనే భార్య అతనిపై తిరగబడి తల్లిదండ్రులను తీసుకురావద్దని గొడవ పడింది.
అయినా గాని జ్యోతిర్మయి మజుందార్ తల్లిదండ్రులను ఇంటికి తెచ్చుకోవటంతో వెంటనే భార్య అతగాడికి నరకం చూపించే విధంగా ప్రవర్తించడం స్టార్ట్ చేసింది. లాక్ డౌన్ టైమ్ లో కంపెనీ లేకపోవడంతో ఇంటి నుండి వర్క్ చేస్తున్నా జ్యోతిర్మయి మజుందార్ ని రోజు చెంపదెబ్బలు కొడుతూ కాల్చిన సిగరెట్లతో వాతలు పెడుతూ అనేక చిత్రహింసలకు భర్తని గురిచేసింది . దీంతో నా పెళ్ళాం నన్ను చంపేస్తుంది బాబోయ్ కాపాడండి అంటూ అతగాడు కేకలు వేసిన చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు ఎవ్వరూ రాలేదట. ఒకరోజు చిన్న గ్యాప్ దొరకడంతో వెంటనే ఇంటి నుండి పరుగులు పెట్టి తన భార్య నుండి విడాకులు కావాలి అని జ్యోతిర్మయి మజుందార్ కోర్ట్ కి అప్లై చేశాడు. అతగాడి బాధలు చూసిన చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు స్పందిస్తూ ఈరోజుల్లో మగవాళ్ళు కూడా గృహ హింస పడుతున్నారు ప్రభుత్వాలు గుర్తించుకోవాలి అని అంటున్నారట.