Pawan kalyan : పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల నుంచి ఎప్పుడు ఫ్యాన్స్ కి భారీ సర్ప్రైజెస్ వస్తాయో అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9 న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ నుంచి మాత్రం మరో అయిదు క్రేజీ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 2021 ..2022 భారీ స్థాయిలో ఎంజాయ్ చేయడం ఖాయం. ఎందుకంటే ఈ రెండేళ్ళలో పవన్ కళ్యాణ్ నుంచి వరసగా సినిమాలు వస్తున్నాయి.
ప్రస్తుతం సెట్స్ మీద రెండు సినిమాలున్నాయి. మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటిస్తున్నాడు. మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ స్క్రీన్ ప్లే .. డైలాగ్స్ అందిస్తుండటం విశేషం. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కాగా ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ సినిమా కూడా తెరకెక్కుతోంది. సూర్య మూవీస్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
రీసెంట్ గా ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం అయింది. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ జాయిన్ అయ్యాడు. పదిరోజుల పాటు పవన్ కళ్యాణ్ ఈ షెడ్యూల్ కోసం డేట్స్ ఇచ్చాడు. ఈ పదిరోజుల్లో ఎంతవరకు టాకీపార్ట్ కంప్లీట్ చేయగలిగితే అంతవరకు కంప్లీట్ చేయాలని క్రిష్ ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి భారీ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు క్రిష్. ఈ సినిమా టైటిల్ అండ్ పవన్ కళ్యాణ్ పోస్టర్ ని మార్చ్ 11 న మహా శివరాత్రి పండుగ సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. క్రిష్ కి కరెక్ట్ గా డేట్స్ ఇవ్వాలే గాని 5-6 నెలల్లో సినిమా రిలీజ్ చేసేస్తాడు. అయితే పవన్ కళ్యాణ్ వరసగా ప్రాజెక్ట్స్ కమిటవడం వల్ల ప్రాజెక్ట్ కాస్త డిలే అవుతోంది