యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ చేస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా సినిమాగా గోపీకృష్ణ మూవీస్, యూవి క్రియోషన్స్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత కూడా ఒక సినిమా కమిటయ్యాడు ప్రభాస్. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రభాస్ కెరీర్లో 21వ సినిమా తెరకెక్కబోతున్న ఈ సినిమాని… ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ సమర్పణలో ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మిస్తున్నారు.
సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో హాలీవుడ్ టెక్నికల్ టీం తో నిర్మించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా రూపొందనున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకుణే నటించనుందని రీసెంట్ గా అధికారకంగా చిత్ర యూనిట్ వెల్లడించారు.
ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మేకర్స్ కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తుంది. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న ‘రాధే శ్యామ్’ కి మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఇంకా డైలమా కొనసాగుతుంది. థమన్ ని ఎంచుకున్నారన్న వార్తలు వస్తున్నప్పటికి ఇందులో నిజమెంతో అధికారకంగా వెల్లడైతే గాని నమ్మగలము.
ఇక ప్రభాస్ 21 కి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ని తీసుకునే ఆలోచనలో ఉన్న మేకర్స్… మరో వైపు ఎం ఎం కీరవాణి గురించి తీవ్రంగా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ”బాహుబలి” సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కీరవాణి కూడా సినిమాని భారీ స్థాయిలో నిలబెట్టగలడని చిత్ర యూనిట్ భావిస్తుందట. అయితే ముందు ఛాయిస్ గా మాత్రం ఏ ఆర్ రెహమాన్ కి ప్రాధాన్యం ఇస్తూ ఈ సినిమాకి 4 కోట్ల వరకు ఆఫర్ చేశారట మేకర్స్. మరి ఈ ఆఫర్ కి రెహమాన్ ఒకే చెప్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.