friendship: ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరు వీరు వారు అవుతారనే సామెత ఉంది. పోలీసులు విధి నిర్వహణలో ఎక్కువ సమయం నేరస్తులతో గడుపుతుంటారు. దీనితో కొందరు కానిస్టేబుళ్లకు దొంగల బుద్దులు వంట పడుతున్నాయి. సాధారణంగా ఎక్కడైనా నేరం జరిగితే బాధితులు పోలీస్ స్టేషన్ కు పిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంటారు.
అయితే ఇప్పుడు నేరం పోలీస్ స్టేషన్ లోనే జరుగుతోంది, నేరం చేస్తుంది పోలీస్, కేసు కట్టాల్సింది, పట్టుకోవాల్సింది పోలీస్ యే. చిత్రంగా ఉంది కదూ. రాష్ట్రంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత నూతన మద్యం పాలసీలో భాగంగా ప్రభుత్వం ద్వారానే మద్యం షాపుల నిర్వహణ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మద్యం షాపులలో నిత్యం విక్రయాల ద్వారా వచ్చిన నగదును సదరు షాప్ ల ఉద్యోగులు మరుసటి రోజు బ్యాంకులలో డిపాజిట్ చేసే వరకు భద్రత కోసం పోలీస్ స్టేషన్ లాకర్ లో ఉంచుతుంటారు. లక్షల రూపాయల నగదు పోలీస్ స్టేషన్ లో రాత్రి సమయాల్లో ఉండటంతో కొందరు కానిస్టేబుళ్ళ కళ్ళు వాటిపై పడుతున్నాయి.
కృష్ణా జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్ లో పనిచేసే ఓ కానిస్టేబుల్ లాకర్ లోని డబ్బుతో ఉదాయించాడు. ఏకంగా రూ.16,56,340 నగదుతో పరారు అయ్యాడు కానిస్టేబుల్. దీనిపై అదే పోలీస్ స్టేషన్ లో నిందితుడిగా మారిన కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం డిఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.