RRR: యంగ్ టైగర్ ఎన్టీయార్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన పాన్ ఇండియన్ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి టాలీవుడ్లో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సినిమాల పరిస్థితి గందరగోళంగా మారింది. ఏకంగా బాలీవుడ్లో ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన ‘గంగూబాయి కతియావాడి’ సినిమా రిలీజ్ డేట్ కూడా మార్చాల్సి వచ్చింది. సంక్రాంతి బరిలో దిగిన మహేశ్ బాబు కూడా తన సర్కారు వారి పాట సినిమా రిలీజ్ను పోస్ట్పోన్ చేసుకున్నాడు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ సమయానికి మరే సినిమా పోటి ఉండకుండా చూసేందుకు రాజమౌళి అన్ని విధాల ప్రయత్నిస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఏపీలో టికెట్ రేట్ కూడా పెంచేలా ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ఇప్పటికే ఏపీ సర్కారు టికెట్స్ రేట్ తగ్గించడంతో సినిమా వసూళ్ళ మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. ఇటీవల వచ్చిన లవ్ స్టోరి సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. ఇక్కడ మంచి లాభాలే తెచ్చిపెట్టిన ఈ సినిమా ఏపీలో మాత్రం నష్ఠాలను చూసినట్టు వార్తలు వచ్చాయి. అంత చిన్న సినిమా పరిస్థితే అలా ఉంటే 450 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించిన ఆర్ఆర్ఆర్ మీద ఈ ప్రభావం ఏ రేంజ్లో పడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓ అంచనాకొచ్చేయొచ్చు.
RRR: జక్కన్న జగన్ను రిక్వెస్ట్ చేయనున్నట్టు సమాచారం.
అందుకే జక్కన్న మాస్టర్ ప్లాన్ వేసి నిర్మాత దానయ్య హీరోలు ఎన్టీయార్ – చరణ్ లను వెంటబెట్టుకొని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా ఆర్ఆర్ఆర్ రిలీజ్ సమయంలో టికెట్ రేట్ పెంచేలా చూడమని జక్కన్న జగన్ను రిక్వెస్ట్ చేయనున్నట్టు సమాచారం. మరి జగన్ ఇంత పెద్ద భారీ
సినిమా చూసి కాకపోయిన ఎన్టీయార్ – చరణ్ చూసైనా జగన్ తగ్గుతారా.. టికెట్ రేట్ పెంచే విషయంలో ఆర్ఆర్ఆర్ టీం కి సహకరిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాను 10 భాషలలో 2022, జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.