Keerthi suresh: టాలీవుడ్లో మాత్రమే కాకుండా సౌత్లో స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ కీర్తి సురేశ్. టాలీవుడ్లో నేను శైలజా సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత అజ్ఞాతవాసి, నేను లోకల్, మహానటి సినిమాలు చేసింది. మహానటి సినిమా కీర్తికి తెచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ క్రేజ్తో కీర్తి సురేశ్ వరుసగా ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ చేసింది. అందులో పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలొచ్చాయి. ఓటీటీలో వచ్చిన ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయాయి.
దాంతో కీర్తి సురేశ్ జోరు బాగా తగ్గింది. ఇలాంటి ప్రయోగాలు చేసి కీర్తి అనవసరంగా చేసి కెరీర్ ఇబ్బందులో పడేసుకుందా అని మాట్లాడుకున్నారు. చాలామంది అభిమానులు కూడా ఇదే ఫీలయ్యారు. అయితే లక్కీగా కీర్తికి చిన్న గ్యాప్ వచ్చినా వరుసగా సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకుంది. నితిన్తో రంగ్ దే, మహేశ్ బాబుతో సర్కారు వారి పాట సినిమాలు అలాగే రజనీకాంత్తో ‘అణ్ణాత్త’, మెగాస్టార్ చిరంజీవితో ‘భోళా శంకర్’ సినిమాలు చేసే అవకాశాలు అందుకుంది. రజనీకాంత్, చిరంజీవికి చెల్లిగా నటించడానికి కీర్తి ఒప్పుకోవడం కాస్త షాకింగ్ విషయమే.
Keerthi suresh: ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ కీర్తికి సెట్ అవవనే రూమర్స్ నుంచి బయటపడుతుంది.
ఇక నానితో మరోసారి కొత్త చిత్రం ‘దసరా’ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. అయితే గత ఏడాది విడుదలవ్వాల్సిన ‘గుడ్ లక్ సఖి’ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఇక ఈ సినిమా రిలీజ్ కాదన్న ప్రచారం కూడా జరిగింది. అయితే మళ్ళీ కాస్త క్రేజ్ పెరుగుతుందటంతో ‘గుడ్ లక్ సఖి’ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమా మీద కాస్త నమ్మకాలు కూడా ఉన్నాయి. మరి ‘గుడ్ లక్ సఖి’ సినిమా హిట్ అయితే ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ కీర్తికి సెట్ అవవనే రూమర్స్ నుంచి బయటపడుతుంది. మరి ఆ రేంజ్ సక్సెస్ కీర్తి సురేశ్కు ‘గుడ్ లక్ సఖి’ ఇస్తుందా లేదా చూడాలి. కాగా ఈ సినిమా డిసెంబర్ 10న విడుదల కాబోతోంది.