Prashanth neel : ప్రశాంత్ నీల్ ..ఇప్పుడు రాజామౌళి లా పాన్ ఇండియన్ క్రేజ్ ఉన్న దర్శకుడు. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈయనకి మన టాలీవుడ్ ప్రేక్షకులే కాదు హీరోలు కూడా ఫ్యాన్స్ అయిపోయారు. అందుకే ఆయన కన్నడ భాషలో కాకుండా టాలీవుడ్ లో వరుసగా సినిమాలను చేసేందుకు అంగీకరిస్తున్నాడు. హీరో ఎవరైనా యాక్షన్ జోనర్ లోనే ప్రశాంత్ నీల్ సినిమాను తెరకెక్కించేందుకు కథలు సిద్దం చేసుకుంటున్నాడు. హీరోలకి పవర్ ఫుల్ యాక్షన్ కథలంటే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే ప్రశాంత్ నీల్ కి పెద్ద ప్లస్ పాయింట్ అయింది. రాజమౌళి అంత క్రేజ్ ఉన్నా ఆయనలా మాత్రం సంవత్సరాల తరబడి సినిమాను తీయడు.
ఆయన తీసిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 రిలీజ్ కి రెడీ అయింది. ఇంతలోనే ప్రభాస్ హీరోగా హోంబలే నిర్మాతలు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చేస్తున్నారు. 6 నెలల్లోనే దీనిని పూర్తి చేయాలనుకున్నారు. అయితే కరోనా వల్ల డిలే అవుతోంది. సలార్ తర్వాత జూనియర్ ఎన్.టి.ఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఉంటుందని మైత్రీ నిర్మాతలు తామే వెల్లడించారు. అయితే అది వచ్చే ఏడాదే అని అర్థమవుతోంది. ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న ఎన్.టి.ఆర్ తర్వాత కొరటాల శివ సినిమా పూర్తి చేయాలి.
Prashanth neel : ప్రశాంత్ నీల్ డైరెక్టర్ గా మహేష్ బాబు హీరోగా ప్రాజెక్ట్..?
అయితే అల్లు అర్జు, మళ్ళీ ప్రభాస్ లతో ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకుంటున్న ప్రశాంత్ నీల్ సూపర్ స్టార్ మహేష్ బాబు ని కూడా డైరెక్ట్ చేసే ఛాన్స్ కోసం స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. డీవీవీ దానయ్య ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా బిజినెస్ కూడా బాగా జరిగిందని ఇప్పటికే ప్రచారం సాగుతోంది. అయితే ఈ నిర్మాత ప్రశాంత్ నీల్ డైరెక్టర్ గా మహేష్ బాబు హీరోగా ప్రాజెక్ట్ సెట్ చేసినట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే గ్యారెంటీగా రాజమౌళి – మహేష్ బాబు పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ డిలే అవుతుందని చెప్పుకుంటున్నారు. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.