పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. ఈ సినిమా లో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్నాడు. శృతిహాసన్ స్క్రీన్ మీద కనిపించేది తక్కువ సేపే అయినప్పటికి రెమ్యూనరేషన్ మాత్రం భారీగానే ముట్ట చెబుతున్నారట. ఇక ఈ సినిమా 2021 సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నారని సమాచారం.
ఇక ప్రస్తుతం శృతిహాసన్ మాస్ మహారాజ రవితేజ నటించిన క్రాక్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో శృతిహాసన్ ఇప్పటి వరకు చేయనటువన్టి ఒక కొత్త తరహా పాత్ర చేస్తుందని చెప్పుకుంటున్నారు. ఇక రవితేజ దర్శకుడు గోపీచంద్ మలినేని తో శృతిహాసన్ కూడా ఈ సినిమా మీద బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.
అలాగే హిందీ లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ తెలుగు రీమేక్ లో శృతిహాసన్ కియారా అద్వానీ నటించిన పాత్రలో కనిపించనుందట. ఈ వెబ్ సిరీస్ లో రానాకు జోడీగా కనిపించబోతుందని సమాచారం. ఈ వెబ్ సిరీస్ కి మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక వైపు వెబ్ సిరీస్ లో బోల్డ్ క్యారెక్టర్ చేస్తూనే మరో వైపు పవన్ కళ్యాణ్, రవితేజ ల సరసన సినిమాలు చేస్తోంది. చాలాకాలానికి శృతి మళ్ళీ టాలీవుడ్ లో బిజీ కాబోతుంది.
అయితే వాస్తవంగా శృతిహాసన్ ఇక సినిమాలకి గుడ్ బాయ్ చెప్పాలనుకుందన్న ప్రచారం జరుగుతోంది. లాంగ్ గ్యాప్ తర్వాత శృతిహాసన్ సినిమాలు చేయాలనుకొని కథలు వింటే అందులో ఏ ఒక్కటి మనసుకు హత్తుకునేలా అనిపించలేదట. చాలా కథలు విని ఇక తెలుగులో మంచి ఆఫర్స్ రావడం కష్టమే అనుకొని బాయ్ చెప్పాలనుకున్న సమయంలో క్రాక్ అవకాశం వచ్చిందట. అంతేకాదు వరసగా ఇప్పుడు వచ్చిన ప్రాజెక్ట్స్ అన్ని శృతిహాసన్ ని చాలా ఎగ్జైట్ చేసినవేనట. లేదంటే శృతిహాసన్ తెలుగు ప్రేక్షకులని వదిలి వెళ్ళిపోయేదే.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!