NewsOrbit
న్యూస్

ఏపీ పోలీసుల తీరు మారదా? చావు మరకలు చెరిగిపోవా??

ఏపీ పోలీసుల మైండ్ సెట్ ఏమీ మారినట్టు లేదు . వారి కారణంగా రోజుకో వివాదం చోటు చేసుకుంటూనే ఉంది.మాస్కు ధరించలేదని చీరాలలో దళిత యువకుడు కిరణ్ కుమార్ ని ఒక ఎస్సై కొట్టడంతో అతను మరణించిన విషయం తెలిసిందే.

అలాగే తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న వర ప్రసాద్ అనే యువకుడికి పోలీసులు శిరోమండనం చేయటం విధితమే.ఇలాంటి సంఘటనలే ఇంకా శ్రీకాకుళం ,చిత్తూరు జిల్లాల్లో కూడా జరిగాయి. ఇలా పోలీసుల దాష్టీకానికి గురవుతున్నవారు దళితులే కావటం ఇంకో ముఖ్యాంశం. పోలీసుల వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ ప్రభుత్వానికి పోలీసులు తలనొప్పిగా మారారు.ఉన్న సమస్యలతోనే ఏపి డిజిపికి తల బొప్పి కట్టగా తాజాగా విజయవాడలో పోలీసుల అదుపులో ఉన్న యువకుడు మరణించడం ఆయనను మరింత ఇరకాటంలోకి నెట్టేసింది.మద్యం అక్రమ రవాణా కేసులో పోలీసులు ఓ దళిత యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించే క్రమంలో అతను తీవ్ర అస్వస్థత గురై మరణించడం సంచలనంగా మారింది.పోలీసులు చిత్రహింసలు పెట్టడం వల్లే అతను మృతి చెందాడంటూ దళిత సంఘాలు ధర్నాకు దిగడంతో బెజవాడ దద్దరిల్లింది.

వివరాల్లోకి వెళితే బెజవాడలోని కృష్ణలంక పెద్దవారి వీధిలో డి.అజయ్(26) తన తల్లి నాగేశ్వరమ్మతో కలిసి నివసిస్తున్నాడు. అజయ్ కారు డ్రైవర్ కాగా.. అతని తల్లి సమీపంలోని చర్చిలో వాచ్ మెన్.ఏపీలో మద్యం అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ ప్రత్యేక నిఘా ఉంచింది. నెలరోజుల క్రితం హైదరాబాద్ నుంచి విజయవాడకు అక్రమంగామద్యం సరఫరా అవుతున్నట్లు గుర్తించారు.చేపల చెరువులో ఆహారం ఉపయోగించే ఫిడ్ లో మద్యం బాటిళ్లు పార్సిల్స్ అవుతున్నట్లు పోలీసులు కనిపెట్టారు.ఈ పార్సిల్ అజయ్ పేరుమీద వస్తుండడంతో అతడిపై పోలీసులు నిఘాపెట్టారు.విషయం తెలిసి పరారీలో ఉన్న అజయ్ ని ఎట్టికేలకు గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అతడిని విచారిస్తున్న సమయం లో అతడు కుప్పకూలడంతో వెంటనే విజయవాడ ప్రభుత్వాస్పత్రి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ అజయ్ మరణించాడు.ఈ విషయం తెలియడంతో దళిత సంఘాలు సంఘాలు ఆస్పత్రి ఎదుట ధర్నాకు కూర్చున్నాయి. దీంతో బెజవాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ మేకా సత్తిబాబు రంగంలోకి దిగి ఆందోళనకారులతో చర్చించారు.అజయ్ అనారోగ్యం వల్లే మరణించాడని పోలీసులు కొట్టలేదని అని అయన చెప్పారు.పోస్టుమార్టం నివేదిక వచ్చాక ఒకవేళ అందులో పోలీసులు కొట్టినందున అతడు మరణించాడని రుజువైతే తదుపరి చర్యలు తీసుకుంటామని సూరిబాబు హామీ ఇచ్చారు.ప్రస్తుతానికి వ్యవహారం సద్దుమణిగినప్పటికీ పోలీసుల మీద పడ్డ మరకలు మాత్రం చెరిగిపోవడం లేదు!

author avatar
Yandamuri

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju