మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చాక ఆయన డ్రీం ప్రాజెక్ట్ అయిన సైరా నరసింహా రెడ్డి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియన్ సినిమాగా భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ లో రాం చరణ్ నిర్మించిన ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మెగాస్టార్ ని ఎంతగానో తృప్తి పరచింది. దాదాపు పదేళ్ళ తండ్రి కల ని సైరా ద్వారా నెరవేర్చాడు రాం చరణ్. కాగా ఈ సినిమాలో మెగాస్టార్ కి జంటగా స్టార్ హీరోయిన్ నయనతార నటించింది. తమన్నా కీలక పాత్ర లో కనిపించగా అనుష్క శెట్టి గెస్ట్ రోల్ లో నటించింది.
అయితే సైరా లో నటించిన స్టార్ హీరోయిన్ .. లేడీ సూపర్ స్టార్ నయనతార మరోసారి మెగాస్టార్ కి జంటగా నటించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారట. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అన్న సినిమా చేస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మెగా పవర్ స్టార్ రాం చరణ్, నిరంజన్ రెడ్డి .. కొణిదెల ప్రొడక్షన్స్ – మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రెజీనా స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుంది. లాక్ డౌన్ తర్వాత రీసెంట్ గా సెట్స్ మీదకి వచ్చిన ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది.
కాగా ఈ సినిమా కంప్లీట్ చేశాక మెగాస్టార్ మలయాళ సూపర్ హిట్ లూసీఫర్ రీమేక్ లో నటించబోతుండగా వి.వి.వినాయక్ దర్శకత్వం వహించబోతున్నాడు. 2021 మార్చ్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాం చరణ్ తో పాటు ఎన్వీ ప్రసాద్ నిర్మించనున్నారు. కాగా పొల్టికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమా కి ప్రస్తుతం తెలుగు నేటివిటీకి తగ్గట్టు.. అలాగే మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్టు మార్పులు చేర్పులు జరుగుతున్నాయట. ఈ క్రమంలోనే ఈ సినిమాలో మెగాస్టార్ కి జంటగా నటించే హీరోయిన్ గా నయనతార అయితే కరెక్ట్ అన్న ఆలోచనకి దర్శక, నిర్మాతలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ త్వరలో రానిందని సమాచారం. కాగా నయనతార గతంలో వెంకటేష్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ అన్న సినిమాలో నటించింది.