టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉన్న డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకరన్న విషయం తెలిసిందే.. అనిల్ డైలాగ్ రైటర్ గా అనేక విజయాలను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత డైరక్టర్ గా మారి హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. ఇకపోతే అనిల్ దర్శకత్వంలో తెరకెక్కిన పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. కాగా గత ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచిన టాలీవుడ్ మల్టీస్టారర్ మూవీ ఎఫ్ 2.. ఒక్క సారిగా అనిల్ రావిపుడి హోదానే మార్చేసింది.
ఈ చిత్రం.. ఆ తర్వాత వచ్చిన సినిమా సరిలేరు నీకెవ్వరు కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక డీసెంట్ కామెడీని హ్యాండిల్ చేయడంలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని, తనదైన మార్క్ టైమింగ్ తో, నవ్వు తెప్పించే డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో ‘ఎఫ్ 3’ చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా త్వరలో ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నుండి మరో మల్టీస్టారర్ రాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే తన తరువాత సినిమాని నాగార్జునతో చేయబోతున్నాడని, ఆ మధ్య నాగార్జున అనిల్ రావిపూడితో సంప్రదింపులు కూడా జరిపినట్లు వార్తలు వచ్చాయి.
ఇక ఈ నిమాని నాగార్జున – అఖిల్ కలయికలో ఉంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.. అయితే వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే సక్సెస్ ఫుల్ మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించి సక్సెస్ అందుకున్న అనిల్ తండ్రి కొడుకులతో చేసే మ్యాజిక్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.