నితిన్ కెరీర్ లో ఫస్ట్ టైం పెద్ద ప్రయోగం చేయబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇప్పటి వరకు nithin దాదాపుగా లవర్ బాయ్ క్యారెక్టర్స్ లోనే కనిపించాడు. తన ఏజ్ కి తగ్గ సినిమాలను ఎంచుకుంటూ సక్సస్ లు అందుకుంటున్నాడు. అప్పుడప్పుడు ఏదో ఒక మాస్ సినిమాతో ప్రయోగం చేస్తున్నాడు. కాని ఆప్రయోగం వికటించి ఫ్లాప్ ని మూటగట్టుకుంటున్నాడు. అందుకే భీష్మ సినిమాతో మంచి హిట్ అందుకొని సక్సస్ ట్రాక్ ఎక్కిన nithin వరసగా ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టుకున్నాడు.
ఇటీవలే టాలెంటెడ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చెక్ సినిమాతో రాబోతున్నట్టు ప్రకటించాడు nithin . చెక్ సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసిన దర్శక, నిర్మాతలు.. ఫిబ్రవరి 19 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు. ఈ సినిమాలో నితిన్ కి జంటగా రకుల్ ప్రీత్ సింగ్ – ప్రియా ప్రకాష్ వారియర్ నటించారు. చంద్ర శేఖర్ యేలేటి శైలిలోనే చెక్ సినిమా రూపొందింది. ఇక ఇప్పటికే అందరూ చెక్ సినిమా బ్లాక్ బస్టర్ అని నమ్మకంగా ఉన్నారు. ఇక యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ కీర్తి సురేష్ జంటగా నటించిన రంగ్ దే సినిమా మార్చ్ 29న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇక బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా అంధాదున్ రీమేక్ లోనూ nithin నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుండగా మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. కాగా nithin కమిటయిన మరో క్రేజీ ప్రాజెక్ట్ పవర్ పేట. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏలూరు రాజకీయ నేపథ్యంలో సాగే పొల్టికల్ డ్రామా అని సమాచారం. ఈ సినిమాలో నితిన్ 60 ఏళ్ల రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా ఈ పాత్రకి సంబంధించిన ఫోటోషూట్ కూడా నిర్వహించారట. క్యారెక్టర్ కి నితిన్ పర్ఫెక్ట్ గా సూటయ్యాడని సమాచారం. అయితే nithin కెరీర్ లోనే ఇంత పెద్ద ప్రయోగం ఎప్పుడు చేయలేదని మరి ఈ ప్రయోగం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అని మాట్లాడుకుంటున్నారట.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?