నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి జంటగా ఇంతక ముందు వేణు శ్రీరాం దర్శకత్వంలో ఎంసీఏ వచ్చిన సంగతి తెలిసిందే. దిల్ రాజు ఈ సినిమాని నిర్మించాడు. ఫిదా లాంటి సూపర్ హిట్ తర్వాత వచ్చిన ఈ సినిమా మీద బాగా అంచనాలు ఉన్నప్పటికి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఆ సినిమా సమయంలో నాని సాయి పల్లవిల మధ్య గొడవ జరిగిందన్న వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఈ ఇద్దరి కాంబినేషన్ సీన్ విషయం లో కాంప్రమైజ్ కాకుండా నువ్వెంతంటే నువ్వెంత అంటూ వాదించుకున్నారట. అది చిన్నపాటి గొడవకి దారితీసింది.
దాంతో సాయి పల్లవి ఈ సినిమా చేయనంటూ తెగేసి చెప్పిందట. దాదాపు షూటింగ్ కంప్లీటవచ్చిన సమయంలో ఇలా జరిగి హీరోయిన్ మధ్యలో సినిమా నుంచి డ్రాపయితే అన్ని రకాలుగా నష్టం వస్తుందని ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు ఇద్దరితో మాట్లాడి కాంప్రమైజ్ చేశాడట. అయితే మళ్ళీ ఈ ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.
నాని త్వరలో టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. శ్యాం సింగ్ రాయ్ పేరుతో తెరకెక్కే ఈ సినిమా సెప్టెంబర్ నుండి సెట్స్ మీదకి వెళ్ళబోతుందట. ఈ సినిమాలో నాని కి జంటగా సాయి పల్లవిని హీరోయిన్ గా ఎంచుకున్నట్టు చెప్పుకుంటున్నారు. మరి ఇద్దరు యాక్టింగ్ లో పోటీ పడి నటించే వాళ్ళే. ఈ పోటీతనం తో మరోసారి గొడవ పడాతారేమో అని సరదాగా కొంతమంది మాట్లాడుకుంటున్నారట.
ఇక ప్రస్తుతం సాయి పల్లవి లవ్ స్టోరీ, విరాట పర్వం సినిమాలు చేస్తుండగా, నాని నటించిన వి రిలీజ్ కి సిద్దంగా ఉంది. నాని సాయి పల్లవి నెక్స్ట్ నటించబోయోది శ్యాం సింగ్ రాయ్ సినిమానే.