ప్రస్తుతం సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప అన్న పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం అక్రమ రవాణా కథాంశంతో.. చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా రష్మిక పల్లెటూరి అమ్మాయిగా కనించబోతున్నారు. ముత్యం శెట్టి మీడియాతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారి బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా మొత్తం అయిదు భాషల్లో రిలీజ్ కానుంది.
అయితే ఎలాంటి మాసీ క్యారెక్టర్ లో నటించాలని అల్లు అర్జున్ రాం చరణ్ నటించిన రంగస్థలం సినిమా చూశాకే డిసైడయినట్టు పుష్ప సినిమా నుంచి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ రిలీజైన తర్వాత వార్తలు వచ్చాయి. అల్లు అర్జున్ కూడా నిజంగానే సుకుమార్ ని రంగస్థలం లాంటి సినిమా చేద్దామని అడగగానే పుష్ప కథ చెప్పాడట. ఈ కథ బన్నీ కి విపరీతంగా నచ్చడంతో మిగతా ప్రాజెక్ట్స్ ని హోల్డ్ లో పెట్టి పుష్ప కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బన్నీ. అంటే ఇండస్ట్రీలో రంగస్థలం స్టార్ హీరోలని ఎంతగా కదిలించిందో అర్థమవుతోంది.
కాగా ఇప్పుడు ఇలాంటి కథాంశం కావాలని మరో టాలీవుడ్ హీరో సుకుమార్ ని పట్టుపట్టినట్టు తెలుస్తోంది. ఆ హీరోనే టాలీవుడ్ రౌడీ హీరోగా అన్నీ వర్గాల ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న విజయ్ దేవరకొండ. పుష్ప సినిమా తర్వాత సుకుమార్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఒక సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ న్యూస్ కూడా ఇప్పటికే వచ్చేసింది.
కాగా ఈ కథ కూడా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందని విజయ్ దేవరకొండ ని సుకుమార్ కంప్లీట్ మాస్ గెటప్ లో చూపించబోతున్నాడని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం త్వరలో రానుందట. అయితే రంగస్థలం సినిమాలో రాం చరణ్ మాదిరిగా సుకుమార్ విజయ్ దేవరకొండ ని చూపిస్తే బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేటవడం గ్యారెంటీ అంటున్నారు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జనగన్నాధ్ కాంబినేషన్ లో ఫైటర్ అన్న వర్కింగ్ టైటిలో ఒక సినిమా షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.