తనను ఎన్నికల కమీషనర్ గా నియమించమని కోర్టు ఆదేశాలు ఇచ్చినా.. ప్రభుత్వం తన నియామకానికి అడ్డుపడుతుంది అంటూ.. నిమ్మగడ్డ రమేష్ కుమార్, హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ పై వాదనలు విన్న అనంతరం స్పందించిన కోర్టు… వెంటనే గవర్నర్ ను కలిసి, తనను అపాయింట్ చెయ్యల్సిందిగా అడగాలి అంటూ ఆదేశాలు జరీ చేసింది.
సుప్రీం కోర్టులో మూడు సార్లు స్టే రాకపోవటంతో.. నిమ్మగడ్డకు ఏ ఉత్తర్వులు తాము ఇచ్చామో, ఆ ఉతర్వులు అమలులో ఉన్నట్టు భావించాలి అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పు ప్రతిని గవర్నర్ కు అందించి.. అనంతరం ఆ నియామక పత్రం ఇవ్వాలని కోర్టు తెలిపింది. వచ్చే శుక్రవారానికి ఈ కేసు వాయిదా వేసిన కోర్టు, ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చెయ్యాలని ఆదేశించింది. ఇది ప్రస్తుతానికి నిమ్మగడ్డ నియామకాన్ని బలంగా కోరుకుంటున్నవారికీ.. నిమ్మగడ్డకూ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ క్రమంలో జగన్ కూడా వారికి ఒక న్యూస్ సిద్ధం చేయబోతున్నారని చర్చ నడుస్తోంది!
ఇక్కడ జగన్ కు రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి అంటున్నారు విశ్లేషకులు! అందులో ఒకటి… ఎవరు ఎలా వాదించినా.. ఎంతెలా వాదించినా.. అనధికారికంగానో, అధికారికంగానో, గవర్నర్ కూడా ప్రభుత్వంలో భాగమే!! ఈ తరుణంలో… గవర్నర్ ద్వారా నిమ్మగడ్డ నియామకాన్ని ఆపే క్రమంలో జగన్ కూడా ఒక స్కెచ్ ప్రిపేర్ చేయబోతున్నారని అంటున్నారు. అది సక్సెస్ అయితే కచ్చితంగా నిమ్మగడ్డ & కో కు అది బ్యాడ్ న్యూసే!! ఇక రెండో ఆప్షన్… నిమ్మగడ్డ ను ఆ కుర్చీలో కుర్చోనిచ్చి … కరోనా కాస్త చక్కబడిన అనంతరం వచ్చే ఏడాది సెకండ్ ఆఫ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం!!