YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో టాలీవుడ్ ఇండస్ట్రీ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బేటీ కాబోతున్నట్లు లేటెస్ట్ వార్త ఇండస్ట్రీలో అదేరీతిలో ఏపీ రాజకీయాల్లో వినపడుతోంది. విషయంలోకి వెళితే ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లు విషయంలో నియంత్రణ చేపట్టే రీతిలో.. సినిమా టికెట్ల పై ప్రభుత్వం నిర్ణయించిన ధరే ఫైనల్ అనే తరహాలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లు మొన్నటిదాకా మీడియాలో వార్తలు వైరల్ అవుతూ వచ్చాయి. ఇదే క్రమంలో కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీకి అనేక ఇబ్బందులు ఎదురు కావడం తెలిసిందే.
మహమ్మారి కరోనా కారణంగా దాదాపూ సంవత్సరంన్నరకు పైగానే థియేటర్లు క్లోజ్ అవటంతో.. సినిమా ఇండస్ట్రీలో చాలా నష్టం వాటిల్లింది. ముఖ్యంగా రెండు వేసవి కాలం లో.. సినిమా థియేటర్లు మూసుకుపోవడంతో కోట్ల వ్యాపారం ఆగిపోవాల్సి వచ్చింది. ఇటువంటి తరుణంలో సినిమా ఇండస్ట్రీలో పెద్దలు చిరంజీవి నాగార్జున మరి కొంతమంది టాప్ డైరెక్టర్లు.. నిర్మాతలు.. వైయస్ జగన్ తో రేపు భేటీ కానున్నారు. సెప్టెంబర్ 4వ తారీఖున సినిమా ఇండస్ట్రీ పెద్దల తో సీఎం జగన్ భేటీ కాబోతున్న తరుణంలో ఈ ఈ సమావేశంలో సినిమా ఇండస్ట్రీ పెద్దలతో పాటు మహేష్ బాబు.. అల్లు అర్జున్ కూడా వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ భేటీలో సినిమా టికెట్ల ధర.. సదరు సినిమా నిర్మాత డిసైడ్ చేసే రీతిలో.. ఉండే విధంగా ప్రభుత్వం దగ్గర అనుమతులు తీసుకునే రీతిలో అదేవిధంగా రాయితీలు కూడా కల్పించే విధంగా.. టాలీవుడ్ పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. గతంలోనే చిరంజీవి నాగార్జున రాజమౌళి ఇంకా చాలామంది ఇండస్ట్రీ పెద్దలు వైయస్ జగన్ తో అప్పట్లో భేటీ అవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గిన తర్వాత.. మరోసారి తెలుగు సినిమా కథలు సీఎం జగన్ తో భేటీ కానున్న నేపథ్యంలో… ఈ వార్త సినిమా రంగంలో రాజకీయ రంగంలో సంచలనంగా మారింది.