ఒకపక్క రాజకీయాల్లో ఉంటూనే మరోపక్క సినిమారంగంలో మంచి స్పీడ్ మీద ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దాదాపు రెండు సంవత్సరాల పాటు వెండితెరపై కనిపించకపోవడంతో పవన్ కళ్యాణ్ తాజాగా ఒప్పుకుంటున్న సినిమాలపై అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో రీఎంట్రీ సినిమా వకీల్ సాబ్ షూటింగ్ కంప్లీట్ కావడంతో త్వరలో రిలీజ్ అవ్వడానికి రెడీ అవ్వటంతో.. ఈ సినిమాకి సంబంధించి టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అన్న ఉత్కంఠ లో ఫ్యాన్స్ ఉన్నారు.
పరిస్థితి ఇలా ఉండగా ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో మొఘలుల కాలం నాటి సినిమా పవన్ కళ్యాణ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బందిపోటు పాత్రలో పవన్ కనిపించనున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో చాలా మంది పేర్లు వినిపించాయి.
కానీ తాజాగా మాత్రం పవన్ సరసన ఐశ్వర్య రాజేశ్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ న్యూస్ తెలుసుకొని ఆమె అయితే సూపర్ అని, పవన్ పక్కన కరెక్ట్ గా సెట్ అవుతుందని అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. ఇదిలా ఉండగా సినిమాలో గిరిజన యువతి పాత్రలో ఐశ్వర్య రాజేశ్ కనిపించనున్నట్లు.. ఇండస్ట్రీ టాక్. ఇదిలా ఉండగా ప్రస్తుతం క్రిష్ కి కరోనా సోకడంతో హోమ్ క్వారంటైన్లో చికిత్స తీసుకుంటున్నారు. అంతా రికవరీ అయ్యాక పవన్ సినిమా స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?