వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని మూడు రాజధానులు లో విశాఖ ని ఒక రాజధాని గా గుర్తించడం తెలిసిందే. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉత్తరాంధ్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. గతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజన జరిగిన తర్వాత ఉత్తరాంధ్ర పై టీడీపీకి మంచి పట్టు ఉండేది.
కానీ ఎప్పుడైతే ప్రతిపక్షనేతగా జగన్ పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగిందో ఉత్తరాంధ్రలో టీడీపీ పతనం స్టార్ట్ అయింది. జగన్ పాదయాత్ర దెబ్బకి 2019 ఎన్నికల్లో భారీ స్థాయిలో ఉత్తరాంధ్రలో వైసిపి మెజార్టీ స్థానాలు గెలవడం జరిగింది. ఇటువంటి తరుణంలో విశాఖను రాజధానిగా జగన్ సర్కార్ గుర్తించడంతో పొలిటికల్ లెక్కలు మొత్తం తారుమారయ్యాయి.
అయితే ఆ గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విశాఖలో టీడీపీ ప్రజా ప్రతినిధులు యథేచ్ఛగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడంతో వాటి వివరాలు బయట పెడుతూ టిడిపి నేతలకు వైసీపీ ప్రభుత్వం చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సబ్బంహరి అదేవిధంగా గీతం యూనివర్సిటీ ఆక్రమించుకున్న భూముల వివరాలు బయట పెట్టి వైసీపీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ ఆధీనంలో ఉన్న భూముల పై దృష్టి సారించింది. భీమునిపట్నం బీచ్ రోడ్డు లోని భూములు అత్యంత ఖరీదైనవి. ఈ ప్రాంతంలో వెలగపూడి రామకృష్ణబాబు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నాడు అని రెవెన్యూ యంత్రాంగం బయటపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. పరిస్థితులు ఇలా ఉండగా వైసీపీ ప్రభుత్వం విశాఖలో వేస్తున్న రాజకీయ ఎత్తుగడలకు రాబోయే రోజుల్లో విశాఖ ప్రాంతంలో టీడీపీ కనుమరుగయ్యే ఛాన్స్ ఎక్కువ అని పరిశీలకులు చెప్పుకొస్తున్నారు.